logo

దేవస్థానం భూమినే కప్పేస్తున్నారు!!

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి దేవస్థానం భూములు ఆక్రమణలకు గురవుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. జేఎన్‌టీయూ కూడలి సమీపంలోని రెండు రోడ్లకు మధ్యలో దేవస్థానానికి చెందిన స్థలం ఉంది.

Published : 18 Apr 2024 04:51 IST

దేవస్థానం భూమిలో వ్యర్థాలు, మట్టి

నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి దేవస్థానం భూములు ఆక్రమణలకు గురవుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. జేఎన్‌టీయూ కూడలి సమీపంలోని రెండు రోడ్లకు మధ్యలో దేవస్థానానికి చెందిన స్థలం ఉంది. ఓవైపు జేఎన్‌టీయూ, మరో వైపు సీతం కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, ఈఎస్‌ఐ ఆసుపత్రి ఉండడంతో ఇక్కడ ధర అధికం. ఇటీవల ఈ స్థలంలో పలు దుకాణాలు వెలిశాయి. అయినా చర్యల్లేవు. గతంలో దేవస్థానానికి చెందిన బోర్డు ఉన్నా.. ప్రస్తుతం మూసుకుపోయింది. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెప్పారు.

గతంలో ఏర్పాటు చేసిన బోర్డు.. ప్రస్తుతం ఇలా కనుమరుగవుతోంది..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని