అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం.
నేతలు పట్టించుకోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారి
న్యూస్టుడే, చీపురుపల్లి, గరివిడి
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. నిత్యం సరకుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగడుగునా శిథిలమై.. గోతులతో నిండిపోయిన ఈ రహదారి మరమ్మతులపై నేతలెవరూ అయిదేళ్లుగా దృష్టిసారించలేదు.
మూడు జిల్లాలకూ కీలకం..
విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి అతి కీలకమైన విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారి వైకాపా ప్రభుత్వం పుణ్యమా అని అతుకుల బొంత మాదిరిగా తయారైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాకు ఈ రహదారి నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. విజయనగరం నుంచి నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం మీదుగా ఈ రహదారి సాగుతోంది. విజయనగరం నుంచి గరివిడి వరకు అక్కడక్కడ కొంత మినహా మిగతా రహదారి గోతులు, గతుకులమయమైంది.
విజయనగరం శివారు నుంచి నెల్లిమర్ల వరకు రోడ్డు ఎక్కడికక్కడ గోతులు పడి, పెచ్చులూడిపోయింది. నెల్లిమర్ల పట్టణంలో రోడ్డు మరింత శిథిలమైంది. గుర్ల నుంచి గరివిడి వరకు ఇదే దుస్థితి. ఈ రహదారిపై అటు విశాఖపట్నం, విజయనగరం, ఇటు పాలకొండ, రాజాం, ఒడిశా వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. రాళ్లు తేలి, గోతులు కావడంతో రాత్రి వేళల్లో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను విజయనగరం, విశాఖపట్నం తరలించాలంటే ఈ రహదారిపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా.. వరదలు, వాహనాల తాకిడికి మళ్లీ అధ్వానంగా తయారవుతోంది. ఈ రహదారి పునర్నిర్మాణంపై వైకాపా ప్రభుత్వం గడిచిన 59 నెలలుగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల గొంతులో గరళం!
[ 20-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, -
ముంచెత్తిన వర్షం
[ 20-05-2024]
పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
[ 20-05-2024]
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. -
నాలుగేళ్లయినా బాలారిష్టాలే!
[ 20-05-2024]
ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. -
వారధి కిందే అక్రమ తవ్వకాలు
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. -
కేజీబీవీల్లో అక్రమాలు..!
[ 20-05-2024]
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. -
ఆయకట్టు ఆయువు తీసేశారు
[ 20-05-2024]
అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం
[ 20-05-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. -
సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. -
నారాయణపురం ఆనకట్ట వెలవెల
[ 20-05-2024]
సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే