అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు.
న్యూస్టుడే, విజయనగరం అర్బన్, ఉడాకాలనీ, రింగురోడ్డు
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు.. వారి పోరాటాలు పెద్దఎత్తున జరిపారు. ప్రభుత్వం మాత్రం మళ్లీ బూటకపు హామీలిచ్చి.. నామమాత్రపు జీవోలతోనే పోరాటాలను అణచివేసింది.. ఇప్పుడు వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.. ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామంటున్నారు.
అంగన్వా‘ఢీ’లు
పోరాటం: 42 రోజుల సమ్మె
రెండు జిల్లాల్లో వీరి సంఖ్య: 7,660
అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం 2023 డిసెంబరు 11 నుంచి 2024 జనవరి 23 వరకు 42 రోజులు సమ్మె నిర్వహించారు. 12 డిమాండ్లలో జీతం పెంపు, పింఛనుతో కూడిన పదవీ విరమణ ప్రోత్సాహకాలు ప్రధానమైనవి. వీటికి ప్రభుత్వం జీవోలివ్వలేదు. మూడు జీవోలు మినహా మిగిలిన డిమాండ్లకు హామీలతోనే సరిపెట్టింది. సమ్మె కాలంలో కేంద్రాలు మూతపడడంతో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు సేవలు నిలిచిపోయాయి. ఎస్మాను ప్రయోగించినా డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం సాగించారు.
జూనియర్ డాక్టర్లు
నిరసన: 2023 డిసెంబరు 28
డిమాండ్: స్టైఫండ్ బకాయిలు
పనిచేస్తున్న వారు 128
ఏడు నెలలుగా చెల్లించాల్సిన స్టైఫండ్ బకాయిలను వెంటనే చెల్లించాలని జూనియర్ డాక్టర్లు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పది రోజుల పాటు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. రాత్రనక, పగలనక విధులు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని, మండల వైద్య కేంద్రాలకు మహిళా వైద్యులను రాత్రి విధులకు పంపించడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పెన్షనర్లు
ధర్నా: 2024 జనవరి 29
డిమాండ్ : డీఏ, ఎరియర్స్ చెల్లించాలి
పనిచేస్తున్న వారు: 27 వేల మంది
ప్రభుత్వ ఫించనుదార్లంతా 70-75 సంవత్సరాలు నిండిన వారికి గతంలో సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పింఛనును 15 శాతానికి పెంచాలని, 2018 నుంచి పెంచిన డీఆర్ ఎరియర్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 నుంచి అమలు చేసిన 11వ పీఆర్సీ తర్వాత ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, ఆరోగ్య కార్డు ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని కోరారు. మెడికల్ రీయింబర్స్మెంట్ పరిధి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, దహనం ఖర్చులు సమయానికి ఇవ్వాలని, ట్రెజరీల ద్వారా చెల్లింపులు జరపాలని కోరారు.
సమగ్రశిక్షా ఉద్యోగులు
సమ్మె చేసిన రోజులు:22
డిమాండ్: హెచ్.ఆర్.పాలసీ
పనిచేస్తున్న వారు: 1780
సమగ్రశిక్షా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు డిసెంబరు 20 నుంచి జనవరి పదో తేదీ వరకు సమ్మె నిర్వహించారు. 16 డిమాండ్లలో ఒక్కటీ నెరవేరలేదు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు డిమాండ్లలో ప్రధానమైనవి. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వర్తింపుచేయాలని, ప్రస్తుతం ఉన్న పార్ట్టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్టైమ్ ఒప్పంద విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి జిల్లాలో ఉన్నా న్యాయం చేయలేకపోయారు.
రోడ్డెక్కిన వీఆర్యేలు
నిరసన తెలిపిన తేదీ: కలెక్టరేట్ 2023 డిసెంబరు 28
ప్రధాన డిమాండ్ : పేస్కేలు అమలు చేయాలి
పనిచేస్తున్న వారు: 968
గ్రామ రెవెన్యూ సహాయకులు పోరాడి సాధించుకున్న డీఏ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి రికవరీ చేసిన నిరంకుశ చర్యను దుయ్యబట్టారు. వీఆర్ఏలకు సంబంధం లేని పనులను చేయించి శ్రమదోపిడీ చేయడాన్ని ఖండించారు. రూ.26 వేలు వేతనం ఇవ్వాలని, తెలంగాణ తరహాలో పేస్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన డీఏను వేతనంతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఎల్వో విధుల నుంచి మినహాయించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల గొంతులో గరళం!
[ 20-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, -
ముంచెత్తిన వర్షం
[ 20-05-2024]
పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
[ 20-05-2024]
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. -
నాలుగేళ్లయినా బాలారిష్టాలే!
[ 20-05-2024]
ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. -
వారధి కిందే అక్రమ తవ్వకాలు
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. -
కేజీబీవీల్లో అక్రమాలు..!
[ 20-05-2024]
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. -
ఆయకట్టు ఆయువు తీసేశారు
[ 20-05-2024]
అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం
[ 20-05-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. -
సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. -
నారాయణపురం ఆనకట్ట వెలవెల
[ 20-05-2024]
సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల