వ్యాపారి వంచన
గత కొన్నేళ్లుగా గ్రామస్థుల నుంచి అప్పులు తీసుకోవడంతోపాటు ధాన్యం సైతం కొనుగోలుచేసి తిరిగి చెల్లించకుండా ఓ వ్యక్తి భారీ స్థాయిలో మోసగించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శనివారం దర్శి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రూ.3 కోట్లకు పైగా మోసపోయామంటూ బాధితుల ఫిర్యాదు
ఎస్సై చంద్రశేఖర్కు గోడు వినిపిస్తున్న త్రిపురసుందరీపురం వాసులు
దర్శి, న్యూస్టుడే: గత కొన్నేళ్లుగా గ్రామస్థుల నుంచి అప్పులు తీసుకోవడంతోపాటు ధాన్యం సైతం కొనుగోలుచేసి తిరిగి చెల్లించకుండా ఓ వ్యక్తి భారీ స్థాయిలో మోసగించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శనివారం దర్శి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.3 కోట్లకు పైగా మోసం జరిగినట్లు వారు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. దర్శి మండలంలోని త్రిపురసుందరీపురం గ్రామానికి చెందిన బొల్లా శేషయ్య చీమకుర్తిలోని మర్రిచెట్లపాలెంలో ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేస్తుంటారు. గ్రామస్థులు ఆయనను నమ్మి వడ్డీకి డబ్బులు ఇవ్వడంతో పాటు పండిన ధాన్యాన్ని కూడా అమ్ముతుంటారు. ఆ వచ్చిన నగదు కూడా శేషయ్య వద్దే దాచి ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ఇలా గ్రామంలోనే దాదాపు రూ.కోటికి పైగా ప్రజలనుంచి ఆయన అప్పులు తీసుకున్నట్లు సమాచారం. సమీప గ్రామాల నుంచి ఇదే రీతిలో తీసుకున్నట్లు మరికొందరు బాధితులు చెబుతున్నారు. హోల్సేల్, రిటైల్ కంపెనీల వారు కూడా ఎరువులు, పురుగుమందులు ఇచ్చారు. ఇలాంటి అప్పులు మరో రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వారం రోజులుగా ఆయన కనిపించకపోవడంతో దాదాపు 25 మంది శనివారం పోలీసులను ఆశ్రయించారు. వీరిలో సంగన పెద వెంకటేశ్వర్లు, అతని బంధువుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మిగిలిన వారి వద్ద ప్రామిసరీ నోట్లు ఉన్నందున కోర్టును ఆశ్రయించాలని సూచించినట్లు తెలిపారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుంటే బాధితులు ఫిర్యాదు చేసిన ఎడల కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
వ్యాపారి శేషయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు