పసుపు.. పెట్టుబడీ దక్కలేదు
ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు.
ఉడకబెట్టిన దుంప పసుపు
కంభం, బేస్తవారపేట గ్రామీణం, న్యూస్టుడే: ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు. పైరు మొలక దశ దాటిన తర్వాత అధిక వర్షాలు కురవడంతో దుంప పుచ్చు, కుళ్లు తెగుళ్లు సోకి దిగుబడులపై ప్రభావం చూపింది. ఈ సంవత్సరం జిల్లాలో 1100 ఎకరాల్లో పంట సాగైంది. 2022తో పోల్చితే నాలుగు వందల ఎకరాలు తగ్గింది. అత్యధికంగా గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, కొమరోలు, రాచర్ల, సీఎస్ పురం, పామూరు, కనిగిరి, అద్దంకి తదితర మండలాల్లో సాగు చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో గత యేడాది 800 ఎకరాల్లో సాగు చేస్తే ఈసారి 580 ఎకరాలకే పరిమితం.
* పెరిగిన సాగు ఖర్చులు: పసుపు దీర్ఘకాలిక పంట కావడంతో పెట్టుబడులు అధికం, ఆదాయం తక్కువగా ఉంటోంది. దాంతో ఏటికేడు సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఒకప్పుడు బేస్తవారపేట మండలం సోమవారపేట, చింతలపాలెం తదితర గ్రామాల్లో వంద ఎకరాలకు పైగా పండించేవారు. ప్రస్తుతం పది ఎకరాలలోపే వేశారు. విత్తనాలు, సేద్యం, కూలీలు, కలుపు ఏరివేత, ఎరువులు, పురుగు మందుల వాడకం, తవ్వకాలు, ఉడకబెట్టడం తదితర ఖర్చులు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు అవుతున్నాయి. బాగా పండితే 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం 15 క్వింటాళ్ల లోపే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, ద]గ్గరలో మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేయడంతో పంటంతా మధ్య దళారులకు క్వింటా రూ.5 వేల చొప్పున అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాదైనా త్వరగా వీటిని ఏర్పాటుచేసి రైతు వద్ద ఉన్న పసుపును కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
క్వింటాకు రూ.8 వేలు ఇవ్వాలి
పసుపు సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ప్రభుత్వమే క్వింటా రూ.8 వేల ధరతో కొనుగోలు చేయాలి. మూడేళ్ల నుంచి గిట్టుబాటు కాలేదు. నేను 60 సెంట్లలో సాగు చేస్తే రూ.65 వేలు ఖర్చుకాగా కేవలం 5 క్వింటాళ్లు వచ్చింది. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. -పుండరీబాబు, రైతు, సోమవారపేట
త్వరగా తీసుకోవాలి
ఈ ఏడాది అర ఎకరా పొలంలో పంట సాగు చేశాను. సుమారు 60 వేలు ఖర్చయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు తీసుకోవాలి. పంటను దాచుకునే వసతులు లేవు. -వెలుగోడు శ్రీను, రైతు
ఏప్రిల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పంట చేతికి వచ్చిన తర్వాత 15 రోజుల పాటు ఉత్పత్తులు ఉడకబెట్టడం, బాగు చేసుకోవడానికి పడుతుంది. ప్రభుత్వం మద్దతు ధర రూ.6,850 నిర్ణయించింది. కంభం, గిద్దలూరు, కనిగిరిలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. - హరికృష్ణ, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు