logo

రెజ్లర్లకు మద్దతుగా నిలవాలి

లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీపై చర్యలు కోరుతూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 03:25 IST

మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, చిత్రంలో ఇతర నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీపై చర్యలు కోరుతూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంగోలు సుందరయ్య భవన్‌లో బుధవారం నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశ కీర్తిని చాటిన మహిళా మల్లయోధుల పట్ల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీస జాలి, దయ లేకుండా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. న్యాయం చేయాలని నిరసనకు దిగిన వారిపై కర్కశంగా వ్యవహరించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయన్నారు. సదరు ఎంపీపై విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలు ఇచ్చినా నేటి వరకు వాటిని బయట పెట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నాయకులు మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పునాటి ఆంజనేయులు, వై.సిద్దయ్య, జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, నాయకులు జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని