జగనూ.. తాగించి చిదిమేస్తావా?
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది.
నిత్య కలహాలతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. చరవాణిలో ఒక్క సందేశమిస్తే నిమిషాల్లో మద్యం బాటిళ్లు ఇళ్ల వద్దకే చేరి పోతున్నాయి. పట్టణాలు, పల్లెలో సైతం ఇదే పరిస్థితులు నెలకొంది. దీంతో గ్రామాల్లో కుటుంబంలో నిత్యం కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమై పోతున్నాయి. నాణ్యత లేని మద్యం బ్రాండ్లను తాగి పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యానికి తోడుగా పశ్చిమ ప్రకాశాన్ని నాటుసారా దెబ్బతీస్తోంది.
పొదిలి, పొదిలి గ్రామీణం, పెద్దదోర్నాల, మార్కాపురం నేర విభాగం, యర్రగొండపాలెం పట్టణం
నిలువరించే వారేరీ
పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలో రెండేళ్ల క్రీతం సారా తాగి పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి దాహార్తిని తీర్చుకోలేక గొంతు ఎండిపోయి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుంటుంబం అనాథ అయింది. మూడేళ్ల కిందట గుండంచర్ల గ్రామంలోనూ ఇదే తరహా ఘటనే చోటు చేసుకుంది. ముంపు గ్రామాల్లో సారా వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా నిలువరించే నాథుడే కరువయ్యారు
వైద్య పరీక్షలో బయటపడ్డ నిజం : అర్థవీడు మండలం పాపినేనిపల్లిలో 2021 జూన్లో ఓ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇరవై కుటుంబాలకు చెందిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ గ్రామంలో సారా ఎక్కువగా తాగడం వల్ల చాలా మంది కామెర్లు, లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.
కల్తీ మద్యం ఏరులై పారుతోంది
వైకాపా ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టారు. గతంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేది. అయిదేళ్లలో రోజుకొక బ్రాండ్తో కొత్త మద్యాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ధర పెంచి కల్తీ మద్యం అందించారు. దీంతో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. కొన్ని గ్రామాల్లో సారా విచ్చలవిడిగా అందుబాటులో ఉంది.
తెల్లయ్య, పెద్దదోర్నాల
సగం జీవితాలు తెల్లారి పోతున్నాయి
సారా తాగడం వల్ల చెంచుల జీవితాలు సగంలోనే తెల్లారిపోతున్నాయి. విచ్చలవిడిగా సారా కాస్తున్న వారిని పట్టుకొని కఠిన శిక్షలు విధించాలి. కొన్ని గిరిజన గూడేల్లో సారా కాయడం అమ్మడం జరుగుతోంది. కొందరికి ఇది వ్యాపారం మారింది. మా చెంచులు సారా తాగడం వల్ల ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికైనా సారా, గంజాయిని అరికట్టాలి.
నిమ్మల ఈదన్న, గిరిజన నాయకుడు, పాలుట్ల
సారా తాగడం మాన్పించాలి
గిరిజనుల జీవితాలు మారాలంటే సారా తాగడం మాన్పించాలి. ఇందుకు అధికారులు చొరవ చూపాలి. సారా తాగందే చెంచులు జీవించలేకుండా ఉన్నారు. నల్లమల గూడేల్లో సారా విచ్చల విడిగా కాస్తున్నారు. అధికారులు నిలువరించ లేకపోతున్నారు. సారాను పూర్తిగా రూపు మాపితేనే గిరిజనుల జీవితాలను బాగుపడతాయి..
బొజ్జ అంకారావు, గిరిజన నాయకుడు, పుల్లలచెరువు చెంచుగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికే ‘ఇంటి’కి పట్టిన శని
[ 02-05-2024]
సీఎం జగన్ చెప్పే కట్టుకథలకు జగనన్న కాలనీలే నిలువెత్తు నిదర్శనం. ఇళ్లు కాదు ఊళ్లంటూ మైకులు పగిలేలా అరిచి చెప్పారు. రొచ్చుగుంతలు, రాళ్లగుట్టలు, శ్మశానాల చెంత, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు సేకరించారు. -
వైకాపా మద్యమా.. మాకేం కనిపించదు
[ 02-05-2024]
‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం.. -
సార్వత్రిక రణం.. హోరెత్తుతున్న ప్రచారం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. -
అధికారాంతమునా అరాచకం
[ 02-05-2024]
ఎన్నికల వేళా వైకాపాలోని భూ బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. విలువైన భూములపై కన్నేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే వాటిలో పాగా వేసేందుకు తహతహలాడుతున్నారు. -
అయిదేళ్లలో కుమ్ముడు
[ 02-05-2024]
గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు. -
జల‘కల’ భగ్నం
[ 02-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు చెందిన పంట పొలాల్లో ఉచితంగా అమర్చాలన్నదే పథకం ఉద్దేశం. -
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సీట్లూ వదలొద్దు
[ 02-05-2024]
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేపట్టకుండా పటిష్ఠ నిఘా అవసరమని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్ సూచించారు. -
నిరుద్యోగ యువత వేసే మార్కులు సున్నా
[ 02-05-2024]
ప్రోగ్రెస్ కార్డు మీ ముందుంచుతున్నాను.. మార్కులు మీరే వేయాలంటూ పదే పదే చెబుతున్న సీఎం జగన్కు నిరుద్యోగ యువతగా తామిచ్చేది సున్నా అని పాదయాత్ర బృందం సభ్యులు ఎద్దేవా చేశారు. -
జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా
[ 02-05-2024]
నాలుగు యుగాల దేవుడిగా భక్తుల నుంచి పూజలందుకునే మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. -
ఓటమి భయం.. తపాలా ఓట్లకు గాలం
[ 02-05-2024]
ఓటమి భయం వైకాపాను వెంటాడుతోంది. ఉద్యోగుల్లో ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రలోభాల పరంపరను మరింత ముమ్మరం చేసింది. తమ నాయకుల ద్వారా ఆ పార్టీలోని కొందరు అనుకూల ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఇతరుల ఓట్లకు గాలం వేస్తోంది. -
కబ్జా చెరలో చారిత్రక దుర్గం
[ 02-05-2024]
చారిత్రక కనిగిరి దుర్గానికీ దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోటను, కొండరాళ్లను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. -
వైకాపా నేత అయినాబత్తిన తెదేపాలో చేరిక
[ 02-05-2024]
ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ తెదేపాలో చేరారు. -
పన్ను పెంపు.. బాదుడే బాదుడు
[ 02-05-2024]
ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది. -
వైకాపా దర్శి అభ్యర్థి ఎదుటే బాహాబాహీ
[ 02-05-2024]
వర్గ విబేధాలు వైకాపాను వీడటం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు వేరు కుంపట్లుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవడంతో పాటు ఏదేని సందర్భం వస్తే గిట్టని వారిపై దాడులకూ తెగబడుతున్నారు. -
కార్మికుల పనివేళలు రీ షెడ్యూల్ చేయాలి
[ 02-05-2024]
జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలులు అధికంగా ఉన్నందున వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పనివేళలను రీ షెడ్యూల్ చేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.