తీరంలో.. ఇసుక దోపిడీ!
ఈ చిత్రాల్లో.. మొదటిదేమో వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట తీర భూముల్లో ఇసుక తవ్వకాలతో ఏర్పడి భారీ నీటి కుంటలు.. వేళ్లతో సహా బయటపడి కూలిపోతున్న జీడి వృక్షాలనూ చూడొచ్చు.. రెండో చిత్రంలో కన్పించేది మంచినీళ్లపేట తీర అటవీ భూముల్లో నిల్వ చేసిన ఇసుక కుప్ప. తీర ప్రాంతాలను ఛిద్రం చేస్తూ అక్రమార్కులు ఎంతలా ఇసుకను తవ్వి డంపింగ్ చేసి తరలిస్తున్నారో.. ఈ చిత్రాలే చెబుతున్నాయి..
వజ్రపుకొత్తూరు, న్యూస్టుడే
ఈ చిత్రాల్లో.. మొదటిదేమో వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట తీర భూముల్లో ఇసుక తవ్వకాలతో ఏర్పడి భారీ నీటి కుంటలు.. వేళ్లతో సహా బయటపడి కూలిపోతున్న జీడి వృక్షాలనూ చూడొచ్చు.. రెండో చిత్రంలో కన్పించేది మంచినీళ్లపేట తీర అటవీ భూముల్లో నిల్వ చేసిన ఇసుక కుప్ప. తీర ప్రాంతాలను ఛిద్రం చేస్తూ అక్రమార్కులు ఎంతలా ఇసుకను తవ్వి డంపింగ్ చేసి తరలిస్తున్నారో.. ఈ చిత్రాలే చెబుతున్నాయి..
జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇందులో అత్యధికంగా వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది. ఇక్కడ హుకుంపేట, మంచినీళ్లపేట, కంబాలరాయుడుపేట, అమలపాడు, కొత్తపేట, కొమరల్తాడ, దేవునల్తాడ, వజ్రపుకొత్తూరు, కిడిసింగి, డోకులపాడు, చినవంక, బాతుపురం, అక్కుపల్లి, గుణుపల్లి, మెట్టూరు తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల తీర భూములున్నాయి. వీటిలో కొన్ని అటవీ శాఖ అధీనంలో ఉండగా.. ఎక్కువ శాతం భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో హుకుంపేట, మంచినీళ్లపేట మధ్య తీర అటవీ భూముల నుంచి ఇసుక అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది.
30 అడుగుల లోతుకు తవ్వకాలు..
ఇసుక మాఫియా తీర ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల లోతు మేర ఇసుకను తవ్వేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యల్లో ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. భారీ తవ్వకాలతో తీరం రూపురేఖలు కోల్పోతోంది. ఇక్కడ సాగవుతున్న మడ అడవులు, సరుగుడు, నీలగిరి, జీడి చెట్లు నేల కూలుతున్నాయి. ఈ కలపను సైతం ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ఇటు అటవీ, అటు రెవెన్యూ అధికారుల చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఇదో రకం అక్రమం..
ఈ ప్రాంతంలో జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. మరో వైపు జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అదనుగా చేసుకొని కొందరు ఈ దందాకు తెర లేపారు. ఇక్కడ ఒక ట్రాక్టరు ఇసుక లోడును రూ.1,000 నుంచి 1,500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. నది నుంచి వచ్చే సాధారణ ఇసుకను లారీల ద్వారా తెచ్చి నిల్వ చేస్తున్నారు. అచ్చం నది ఇసుకలా ఉండే సముద్ర ఇసుకను అందులో కొంత కలిపి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఇలా కలిపిన ఇసుకను ట్రాక్టరు లోడు రూ.6,500 నుంచి రూ.8 వేల మధ్య అమ్ముతున్నారు. ఈ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇటు తీరం నష్టపోవడంతోపాటు, అటు ఈ ఇసుకతో నిర్మించిన భవనాలూ తొందరగా దెబ్బతినే అవకాశమూ ఉంటుంది.
నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తాం
- రాజు, అటవీ సెక్షన్ అధికారి, టెక్కలి రేంజ్
తీర అటవీ భూముల్లో నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిపై ఇది వరకే కొందరిపై కేసులు నమోదు చేశాం. అయినా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గట్టి నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టే చర్యలు తీసుకుంటాం. వ్యాపారులను పట్టుకొని కేసులు నమోదు చేస్తాం.
కఠిన చర్యలు తీసుకుంటాం
- బి.అప్పలస్వామి, తహసీల్దార్, వజ్రపుకొత్తూరు
తీర అటవీ భూముల్లో చేపడుతున్న ఇసుక తవ్వకాలపై ఆయా ప్రాంత వీఆర్వోలు, వీఆర్ఏలతో పర్యవేక్షణ చేస్తాం. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసినా కఠిన చర్యలు చేపడతాం. ఈ విషయం కలెక్టరు దృష్టికి తీసుకెళతాం. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి తవ్వకాలు అడ్డుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ