రీసర్వేకు నిధులు సమకూర్చండి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వేకు నిధుల సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం నిధులను సమకూర్చాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్ శ్రీకేష్
మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, చిత్రంలో ఇతర నాయకులు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వేకు నిధుల సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం నిధులను సమకూర్చాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, జేసీ ఎం.విజయసునీతలను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం రెవెన్యూ సర్వీసుల సంఘ అతిథిగృహంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రీసర్వేకు వినియోగిస్తున్న కొలత రాళ్లు, జిరాక్సులకు రూ.లక్షలు ఖర్చవుతోందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంతకముందు శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వేలో ఎదురువుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వేణుగోపాలరావు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, కార్యదర్శి బి.వి.వి.ఎన్.రాజు, జిల్లా ప్రతినిధులు పి.శ్రీనివాసరావు, జి.ఎల్.శ్రీనివాసరావు, దిలీప్ చక్రవర్తి, ప్రవల్లిక, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మంత్రి.. పలాసకు చేసిందేంటి?
[ 07-05-2024]
పలాస ముఖచిత్రాన్ని మారుస్తామని గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీదిరి అప్పలరాజు అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారు. కాలం కలిసి రావడంతో వైకాపా ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. అయిదేళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. -
ముఖ్యమంత్రి గారూ.. బటన్ నొక్కేస్తే నీళ్లిచ్చినట్లేనా..
[ 07-05-2024]
ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార జలాశయం నుంచి ఉపరితల జలాలు అందిస్తామని జగన్ ఊదరగొట్టారు. -
జగన్మాయ..!
[ 07-05-2024]
ఉద్దానం పేరు వినగానే కిడ్నీ వ్యాధితో అతలాకుతలమైన కుటుంబాలు గుర్తుకొస్తాయి. కాశీబుగ్గ వద్ద తెదేపా హయాంలో శంకుస్థాపన చేసిన భవన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తి చేసినా తగిన వసతులు కల్పించలేదు. -
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల పాటు కొనసాగిన వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్నాయుడు, గొండు శంకర్ పిలుపునిచ్చారు. -
కమ్యూనిస్టు యోధుడు శ్రీరాములు కన్నుమూత
[ 07-05-2024]
మండల పరిధి నగరంపల్లిలో సోమవారం తొలితరం కమ్యూనిస్టు యోధుడు బమ్మిడి శ్రీరాములు (91) అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు భావజాలంతో కొనసాగారు. -
సముద్రమంత కష్టం.. వలస బతుకులే శరణ్యం
[ 07-05-2024]
మత్స్యకారుడైన అప్పలరాజు మత్స్య శాఖకు మంత్రి కాగానే ఆ సామాజిక వర్గీయులు సంబరపడ్డారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. వీలున్నప్పుడల్లా ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. -
చేనేత ఊపిరి తీసిన జగన్..!
[ 07-05-2024]
సంప్రదాయ వస్త్రాలను ఉత్పత్తి చేసే నేతన్నల బతుకు భారంగా మారింది. ఐదేళ్ల పాలనలో జగన్ కనీస ప్రోత్సాహం అందించలేదు. చేనేత గ్రామాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో మగ్గం చప్పుడు వినిపించడం లేదు. -
ప్రచారం జోరు..!
[ 07-05-2024]
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులలో అత్యధికులు ఈ పార్టీ వెంటే ఉన్నారని, రాబోయే కాలంలో సముచిత స్థానం లభిస్తుందని పట్టణ తెదేపా అధ్యక్షులు కాళ్ల ధర్మారావు యాదవ్ అన్నారు. -
నీరు గారిన పథకం
[ 07-05-2024]
ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాల నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
[ 07-05-2024]
కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 07-05-2024]
అయిదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలను వెళ్లగొట్టి యువతను నిరుద్యోగులుగానే వదిలేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు... -
ఆఖరి మజిలిలోనూ ‘అవస్థలే’..!
[ 07-05-2024]
నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 400లకు పైగా శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం రూపురేఖలే కోల్పోయాయి. దీంతో దహన సంస్కారాలకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్