నైపుణ్యం ఉంటే.. కొలువు మీదే..
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల జోరు తగ్గింది. గతంలో ఈ సమయానికి పలు సంస్థలు వందల మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
అంబేడ్కర్ వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు
న్యూస్టుడే, ఎచ్చెర్ల: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల జోరు తగ్గింది. గతంలో ఈ సమయానికి పలు సంస్థలు వందల మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 43 శాతం నియామకాలు తగ్గిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం భయంతో ప్రస్తుతం ఐటీ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారిలో నైరాశ్యం నెలకొంది. కానీ ప్రస్తుత అవసరాలకు తగిన నైపుణ్యం సంపాదిస్తే సులభంగా కొలువు సాధించవచ్చునని పలువురు చెబుతున్నారు.
జిల్లాలో ఒక ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చివరి సంవత్సరం 1543 మంది చదువుతున్నారు. వివిధ కంపెనీల్లో ఇప్పటికి 550 మంది మాత్రమే ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించారు. ఎంపికైన వారికి సైతం ఆయా కంపెనీలు నియామక పత్రాలు అందజేయలేదు. గతేడాది ఇంజినీరింగ్ విద్యార్థులు మూడు, నాలుగో సంవత్సరం ప్రథమంలో (ఏడో సెమిస్టర్లో) ఎక్కువ శాతం కొలువులు సాధించారు. మిగిలిన వారు 8వ సెమిస్టర్లో ఎంపికయ్యారు. ప్రస్తుతం 8వ సెమిస్టర్ ప్రారంభమైనా సగానికి పైగా ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించలేదు. పలు సంస్థలు ఎంపికలు చేపట్టినప్పటికీ ప్యాకేజీని తగ్గించేస్తున్నాయి. గతేడాది ఎంపికైన వారికి ముందు ప్రాధాన్యం ఇస్తూ పిలుస్తుండగా వీరిలో కొంతమందికి వేరే ఉద్యోగం చూసుకోమని సమాచారం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రాంగణ ఎంపికల తేదీలను ప్రకటించి తర్వాత రద్దు చేసిన సందర్భాలూ ఉన్నాయి.
మారిన పరిస్థితి..
కొవిడ్ సమయంలోనూ ఇంజినీరింగ్ విద్యార్థులను సంస్థలు అత్యధిక సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. ఇంటివద్దే ఉద్యోగం చేసేలా(వర్క్ ఫ్రం హోం) ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఎంపికలు జరిగాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎక్కువ కాలం మాంద్యం ప్రభావం పడితే ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
వేచి చూసే ధోరణి..
- ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్రధానాచార్యులు, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, టెక్కలి
గతంలో కొవిడ్తో డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడంతో సాఫ్ట్వేర్ సంస్థలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. దీంతో దాదాపు ప్రతి కళాశాల నుంచి 80-100 శాతం మందికి కొలువులు దక్కాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో చాలావరకు పెట్టుబడులు తగ్గించి ఉన్నవారికే లేఆఫ్లు ఇస్తూ వేచిచూసే ధోరణిలో ఉన్నాయి.
అవకాశాలకు సిద్ధంగా ఉండాలి..
- పెద్దాడ జగదీశ్వరరావు, డైరెక్టర్, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ
ప్రస్తుతం నైపుణ్యాలు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి. విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా డిమాండ్ ఉన్న కృత్రిమ మేధ, డేటాసైన్స్, కోడింగ్ వంటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కోర్సులను నేర్చుకుంటూ వచ్చిన ఏ అవకాశమైనా సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
అంతటా ఇలాగే ఉంది..
- మొదలవలస గోదావరి, సాఫ్ట్వేర్ నిపుణుడు
ప్రస్తుతం యూరోపియన్ దేశాలు, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కొవిడ్ సమయంలో డిజిటలైజేషన్ వల్ల ఆన్లైన్ తరగతులు, కోర్సులతో అవసరం కంటే ఎక్కువ మందికి కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇది తాత్కాలికమే. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంటే కొంచెం ఆలస్యమైనా మంచి అవకాశాలు లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్