అడ్డుకట్టేశారు!
మహేంద్రతనయ నదిపై పర్లాఖెముండి వద్ద ఒడిశా అధికారులు ఇసుక బస్తాలతో తాత్కాలిక అడ్డుకట్ట వేయడంతో పాతపట్నం మండలంలో పలు ప్రాంతాలకు నీటికష్టాలు రానున్నాయి.
మహేంద్రతనయ ప్రవాహానికి ఒడిశా అడ్డు
పరీవాహక గ్రామాల్లో తాగు, సాగునీటికి ఇక్కట్లు
ప్రవాహానికి ఒడిశా అడ్డుగా వేసిన ఇసుక బస్తాలు
న్యూస్టుడే, పాతపట్నం: మహేంద్రతనయ నదిపై పర్లాఖెముండి వద్ద ఒడిశా అధికారులు ఇసుక బస్తాలతో తాత్కాలిక అడ్డుకట్ట వేయడంతో పాతపట్నం మండలంలో పలు ప్రాంతాలకు నీటికష్టాలు రానున్నాయి. ఒడిశా భూభాగంలో పుట్టిన ఈ నది పాతపట్నం వద్ద ఆంధ్రాలో ప్రవేశించి గొట్టాబ్యారేజీ సమీపంలో వంశధారలో కలుస్తుంది. ఈ నది నీరు ఒడిశాతో పాటు జిల్లాలోని పాతపట్నం మండలానికి అత్యంత కీలకం. ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రం పర్లాఖెముండి పట్టణానికి తాగునీటి సరఫరాకు ముందు జాగ్రత్తగా అధికారులు ఈ చర్యకు పూనుకోవడంతో జిల్లాకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. రానున్న వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ప్రవాహం ఆగిపోయి మరిన్ని తాగు, సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
పర్లాఖెముండి వద్దనే..: మహేంద్రగిరుల నుంచి వస్తున్న ఈ నది నీరు ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరం. ఒడిశాలో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ప్రస్తుతం నదిలో నీటి ఊటలు మాత్రమే ప్రవహిస్తున్నాయి. వీటికీ అడ్డుకట్టవేడయంతో పాతపట్నం నుంచి దిగువ ప్రాంతానికి నీరు దాదాపు ఆగిపోయినట్టే. నదీతీరంలో ఏడు రక్షిత నీటి పథకాలు, రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. పాతపట్నం మండలంలోని పాతపట్నం, గోపాలపురం, కొరసవాడ, కాగువాడ, సీది, హిరమండలం మండలంలోని ధనుపురం గ్రామాల పరిధిలో 30 వేల మంది జనాభాకు ఇదే తాగునీరు. పాతపట్నం, కొరసవాడ గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటికింద రబీలో 400 ఎకరాలకుపైగా సాగయ్యేది. నీటినిల్వల అనిశ్చితి కారణంగా పలువురు సాగు నిలిపేశారు. రక్షిత పథకాలకూ తగినంతగా నీటి నిల్వలు అందడంలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి. స్థానిక అధికారులు, నాయకులు స్పందించి అడ్డుకట్ట తొలగింపునకు చర్యలు తీసుకోకపోతే ప్రవాహం పూర్తి స్థాయిలో ఆగిపోయి పాతపట్నం మేజరు పంచాయతీ ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వెంటనే స్పందించాలి: ఆంధ్రా ప్రాంతంలో ప్రధానంగా పాతపట్నం మేజరు పంచాయతీతో పాటు పలు గ్రామాల్లో రక్షిత నీటి పథకాలు మహేంద్రతనయ నదీతీరంలో ఉన్నాయి. వేసవిలో నదిలో నీటి ప్రవాహాన్ని ఒడిశా అధికారులు అడ్డుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తుతుంది. దీని పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఎస్.జోగారావు, సర్పంచి ప్రతినిధి, పాతపట్నం
పరిశీలించి చర్యలు: మహేంద్రతనయ నదిలో నీటికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేసి నిలపడం సరికాదు. ఒడిశా నుంచి సాధారణంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నీటిపారుదలశాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి, వారి సూచనల మేరకు తగు చర్యలు చేపడతాం.
కె.రవిచంద్ర, తహసీˆల్దార్, పాతపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?