‘ఈ టీచర్ మాకొద్దు’
బూర్జ మండలం పాలవలస ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయిని తమకు వద్దంటూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు
పాలవలసలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
పాఠశాలలో ఉపాధ్యాయినిని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
బూర్జ, న్యూస్టుడే: బూర్జ మండలం పాలవలస ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయిని తమకు వద్దంటూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ప్రధానోపాధ్యాయురాలు వై.మాలతి అధ్యక్షతన పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షల సమయం వస్తున్నందున తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలపాలని హెచ్ఎం కోరారు. దీంతో ముక్తకంఠంతో వారంతా సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయిని బి.ప్రసన్నకుమారి తమకు వద్దంటూ తేల్చి చెప్పారు. సరిగ్గా పాఠాలు చెప్పకపోవడంతో పాటు ఏమైనా సందేహాలు అడిగితే బెదిరించడం, సహచర ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం వంటివి చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలాగే గతేడాది 29 మంది పదో తరగతి విద్యార్థులు కేవలం సాంఘికశాస్త్రంలోనే పరీక్ష తప్పారని నిలదీశారు.
స్పృహ తప్పి.. పడిపోయి..
సాంఘికశాస్త్ర ఉపాధ్యాయిని మాట్లాడుతూ 2017 నుంచి ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నానని, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నట్లు తెలిపారు. గతేడాది సెప్టెంబరు నుంచి ఆరోగ్య సమస్య కారణంగా తాను ఎక్కువగా సెలవులో ఉన్నట్లు చెప్పారు. ఆంగ్లంలో పదో తరగతి విద్యార్థులకు బోధించే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. అనంతరం ఉపాధ్యాయిని ఒక్కసారిగా స్పృహ తప్పారు. సపర్యలు చేసిన అనంతరం ఆమెను 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. లోబీపీ కారణంగా స్పృహ తప్పారని, ఎటువంటి సమస్య లేదని వైద్య సిబ్బంది తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
[ 28-04-2024]
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. -
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.