అయ్యా స్పందించండి!
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉన్న ఊరిని, ఆస్తిని త్యాగం చేశారు.. పూర్తిగా ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మారు..
ఇళ్ల నిర్మాణం పూర్తయినా అందని బిల్లులు
చెల్లించాలంటూ వంశధార నిర్వాసితుల వేడుకోలు
ఎల్ఎన్పేట: శ్యామలాపురం పునరావాస కాలనీ
న్యూస్టుడే, ఎల్ఎన్పేట, పాతపట్నం, హిరమండలం: జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉన్న ఊరిని, ఆస్తిని త్యాగం చేశారు.. పూర్తిగా ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మారు.. పునరావాస కాలనీకి వచ్చాక పట్టించుకునే వారే కరవయ్యారు. కనీసం ఇళ్ల నిర్మాణాలకూ బిల్లులు ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మా త్యాగానికి ఇదా ఫలితమంటూ వాపోతున్న వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల గోడు ఇది.
నిర్వాసితుల్లో పేదలకు ప్రభుత్వం 2,467 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కొక్క ఇంటికి రూ.1.50 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పింది. తీరా ఇళ్ల పనులు ప్రారంభించాక ఒక్క రూపాయి నుంచి రూ.18 వేల వరకు మాత్రమే చెల్లించి ఐదేళ్లుగా బిల్లులు నిలిపేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా బిల్లు మంజూరు చేయలేదని నిర్వాసితులు వాపోతున్నారు. సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పందించి మంజూరు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
నాడు రైతులు.. నేడు కూలీలు
నిర్వాసితుల్లో 95 శాతం మంది రిజర్వాయర్ నిర్మాణం కాకముందు రైతులుగా ఉండేవారు. ప్రస్తుతం పునరావాస కాలనీలకు చేరడంతో కూలీలుగా మారిపోయారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. వ్యవసాయం, ఇతర మార్గాల నుంచి ఆదాయం లేకపోవడంతో ఇంటి కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలని వీరు ఆందోళన చెందుతున్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రులు, జిల్లా అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్ఎన్పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో 12 పునరావాస కాలనీల్లోని పేద నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో 1,120 మంది నిర్మాణాలు పూర్తిచేసుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. వీటికి అరకొరగా బిల్లులు చెల్లించిన అధికారులు గత శాసనసభ ఎన్నికల తర్వాత ప్రారంభించిన 1,342 మంది ఇళ్లను ఇంతవరకు కనీసం పరిశీలించలేదు, అధికారికంగా నమోదు కూడా చేయలేదు. ప్రస్తుతం వీరు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీలో శివాలయం అర్చకులుగా ఉన్న రుద్రసంటి సోమయ్యకు ఒక్క రూపాయి ఇంటి బిల్లు రావడంతో పనులు ప్రారంభించాలని అధికారులు చెప్పారు. లెంటల్ ఎత్తు వరకు నిర్మాణం చేపట్టాం. కానీ బిల్లు మంజూరు కాలేదు. దీంతో ఆలయం పక్కనే పురిపాకలో ఉంటున్నారు. గతేడాది తుపానుకు రేకులు ఎగిరిపోయాయి. గ్రామస్థులు చందాలు పోగు చేసి మళ్లీ రేకులు వేశారు.
పెద్దకోట పుష్పలత తాయిమాంబపురం పునరావాస కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇల్లు మంజూరు కావడంతో అధికారులు నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు తొలుత ఒక్క రూపాయి మాత్రమే బిల్లు మంజూరు చేశారు. రూ.2 లక్షలు ఖర్చు చేసి పైకప్పు వరకు వేశారు. ఇంక స్థోమతలేక అసంపూర్తిగా ఉన్న ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. బిల్లు మంజూరు చేస్తే ప్లాస్టింగులు, గచ్చులు వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.
ప్రతిపాదనలు పంపాం: 2018లో పేద నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన వారికి 2019లో కొంత మేర బిల్లులు మంజూరు చేశాం. మిగిలిన బిల్లుల సొమ్ము ఇంకా రాలేదు. వస్తే ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం
నర్సింగరావు, డీఈఈ, గృహ నిర్మాణశాఖ, పాతపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు