హార్మోన్లపై ప్రభావం..మానసిక కల్లోలం
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది.
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది. శరీరంలోని సోడియం, పొటాషియం ఇతర లవణాలు తగ్గి చివరికి మానసిక కల్లోలానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటినే సీజనల్ ఎఫెక్ట్ డిజార్డర్స్గా వ్యవహరిస్తారు.
* రుతువులు మారిన ప్రతిసారి ఆ ప్రభావం జీవులపై పడుతుంది. సాధారణంగా చలికాలంలో కొందరు కుంగుబాటుకు లోనవుతారు. వేసవిలోనూ కొన్ని రకాల మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో పగటి సమయం ఎక్కువ. అందుకు తగ్గట్లు శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కొందరిలో హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇదే మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
* కొందరి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువ మాట్లాడటం.. పాటలు పాడటం.. నృత్యాలు చేయడం.. పనులు ఎక్కువ చేయడం లాంటి లక్షణాలు వీరిలో కన్పిస్తుంటాయి. ఇవి మరీ ఎక్కువైతే ఇతర సమస్యలకు దారితీస్తాయి.
* ఇలాంటి లక్షణాలు ఉంటే ఎండలో తిరగడం తగ్గించాలి. వీలైతే చల్లని ప్రాంతాల్లో ఉండేలా చూడాలి.ఎక్కువ కాంతి ఉన్న లైట్లు శరీరం, ముఖంపై పడకుండా చూసుకోవాలి.
* ఎండలో తిరగడం వల్ల శరీరం నుంచి అదే పనిగా చెమట రూపంలో నీళ్లు పోతుంటాయి. ఇదే సమయంలో ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం ఇతర మూలకాలను శరీరం కోల్పోతుంది. ఈ ప్రభావం ఒక్కసారిగా మెదడుపై పడుతుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ఇవే మానసిక సమస్యలకు కారణమవుతాయి.
* చిరాకుగా మాట్లాడటం, పెద్దపెద్ద శబ్దాలు విన్పిస్తున్నట్లు భ్రమించడం, కుటుంబ సభ్యులను గుర్తించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ పరిస్థితి కన్పిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించడం మంచిది.
* నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం లాంటివి తీసుకుంటూ ఉంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..