సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు.
జలుమూరు: ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
జలుమూరు, న్యూస్టుడే: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలు క్లస్టర్ పరిధికి ఎంత దూరంలో ఉన్నాయి.. అక్కడకు రవాణా సౌకర్యం, తదితర అంశాలపై ఆరా తీశారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద ఓటింగ్పై అధికారులకు సూచనలు చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రచారాల్లో పాల్గొనకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులను అడిగి తెలుసుకున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండాలన్నారు. పోలింగ్ శాతం 80 కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ఎంసీసీ నోడల్ అధికారి కృష్ణారావు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలను పరిశీలించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. నియోజకవర్గ ఆర్వో రామ్మోహనరావు, ఎన్నికల డీటీ శరత్, తహసీల్దారు సిహెచ్ నాగమ్మ, డీటీ శ్రీనివాసరావు, ఆర్ఐ సతీష్కుమార్, ఎంపీడీవో దామోదరరావు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన : సారవకోట, పోలాకి, న్యూస్టుడే: సారవకోట, పోలాకి మండల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ గురువారం పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోని సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదట రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై నరసన్నపేట నియోజకవర్గ ఆర్వో రామ్మోహనరావు, తహసీల్దార్ పి.భాగ్యవతి, ఎస్సై జి.అప్పారావుతో సమావేశమై సూచనలిచ్చారు. అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారాలు చేస్తే నోటీసులివ్వాలని ఆదేశించారు. పోలాకి మండల పరిధి నరసాపురం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తాగునీరు, ఐఎస్ఎల్, భవనాలకు విద్యుత్తు సదుపాయాలపై వీఆర్వో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ ఎల్వీ ప్రసాద్కు పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్