Srikakulam: ‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవరుపై వైకాపా కార్యకర్త దాడి
బాధితుడు గట్టెం శ్రీను, ధ్వంసం చేసిన ఆటో అద్దం
రణస్థలం, న్యూస్టుడే: జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రణస్థలం మండలం అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన గట్టెం శ్రీనును అదే గ్రామానికి చెందిన లంకలపల్లి కల్యాణ్ వైకాపా అభ్యర్థి నామినేషన్కు ఆటో తీసుకురావాలని కోరాడు. తనకు ఉదయం 10 గంటల్లోపు కుదరదని.. ఆ తర్వాత కావాలంటే వస్తానని శ్రీను చెప్పాడు. ఈ విషయమై ఇద్దరూ ఫోన్లో గొడవ పడ్డారు. ‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతాను’ అంటూ కల్యాణ్ ఫోనులో బెదిరిస్తూ.. దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని శ్రీను ఆ గ్రామంలోని తెదేపా నాయకుడు పైడయ్యరెడ్డికి చెప్పేందుకు ఆటోలో వెళ్తుండగా అడ్డుకుని శ్రీనుపై దాడి చేశారు. ఆటో అద్దం ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శ్రీను తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ నిశిత పరిశీలన
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పరిశీలించారు. -
పోరాట ఫలితంగానే వేతన సవరణ
[ 06-05-2024]
పోరాట ఫలితంగానే వేతన సవరణను సాధించుకోగలిగామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి రాంబాబు పేర్కొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
[ 06-05-2024]
ఇచ్ఛాపురం పట్టణం పెద్దాకులవీధిలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శ్రీదేవి సుష్మల్ (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో కొండలు కొల్లగొట్టేశారు.. దొరికినకాడిని భూకబ్జాలకు పాల్పడ్డారు.. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి దాడులకు తెగబడ్డారు. అరాచకాలకు అంతులేకుండా వ్యవహరించారు. తాజాగా ఇవన్నీ అధికారికం చేసే కుట్రకు తెర లేపారు. -
ఉద్దానం ఊపిరి తీసేశారు..!
[ 06-05-2024]
‘అన్న చెప్పారంటే చేస్తారంతే’.. ఇది వైకాపా శ్రేణులు తరచూ చెప్పే మాట. జగన్ ఆదుకుంటారేమోనని ఐదేళ్లు ఎదురుచూసినా కొబ్బరి రైతులకు మాత్రం ఎలాంటి ఫలితం లేకపోయింది. దిగుబడులు నామమాత్రంగా రావడం.. పరిశ్రమ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. -
మీరైతే.. ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా జగన్..?
[ 06-05-2024]
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో వైకాపా ప్రభుత్వం చాలావరకు ఊరికి దూరంగా స్థలాలు కేటాయించింది. కొండలు, శ్మశానాల దగ్గర కాలనీలను గుర్తించారు. లేఅవుట్ల దగ్గరకు వెళ్లడానికి సరైన మార్గం లేదు. -
అయిదేళ్లుగా ఆధునికీకరణను అటకెక్కించారు..!
[ 06-05-2024]
‘వైకాపా అధికారంలోకి రాగానే నారాయణపురం ఆనకట్టను ఆధునికీకరించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం.’ అంటూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ గొప్పలకు పోయారు. -
ఉద్యోగులకు ఓటు పరీక్ష
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉద్యోగులు ఆపసోపాలు పడ్డారు. నరసన్నపేట జూనియర్ కళాశాలలో నియోజకవర్గానికి చెందిన 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచి ఉద్యోగుల తాకిడి నెలకొంది. -
ఇవేం ఏర్పాట్లు?
[ 06-05-2024]
శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది.