logo

Srikakulam: ‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’

జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ నామినేషన్‌కు ఆటో పెట్టలేదని డ్రైవర్‌పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

Published : 24 Apr 2024 06:17 IST

నామినేషన్‌కు ఆటో పెట్టలేదని డ్రైవరుపై వైకాపా కార్యకర్త దాడి

బాధితుడు గట్టెం శ్రీను, ధ్వంసం చేసిన ఆటో అద్దం

రణస్థలం, న్యూస్‌టుడే: జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ నామినేషన్‌కు ఆటో పెట్టలేదని డ్రైవర్‌పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రణస్థలం మండలం అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన గట్టెం శ్రీనును అదే గ్రామానికి చెందిన లంకలపల్లి కల్యాణ్‌ వైకాపా అభ్యర్థి నామినేషన్‌కు ఆటో తీసుకురావాలని కోరాడు. తనకు ఉదయం 10 గంటల్లోపు కుదరదని.. ఆ తర్వాత కావాలంటే వస్తానని శ్రీను చెప్పాడు. ఈ విషయమై ఇద్దరూ ఫోన్‌లో గొడవ పడ్డారు. ‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతాను’ అంటూ కల్యాణ్‌ ఫోనులో బెదిరిస్తూ.. దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని శ్రీను ఆ గ్రామంలోని తెదేపా నాయకుడు పైడయ్యరెడ్డికి చెప్పేందుకు ఆటోలో వెళ్తుండగా అడ్డుకుని శ్రీనుపై దాడి చేశారు. ఆటో అద్దం ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శ్రీను తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని