పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి
పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి రామదాస్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 25 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్న జీకే మణికి ఇటీవల అభినందన సమావేశం జరిగింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్ణయించారు. యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణికి సీనియర్ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.
ఏకగ్రీవంగా ఎన్నిక
సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు
సైదాపేట, న్యూస్టుడే: పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి రామదాస్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 25 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్న జీకే మణికి ఇటీవల అభినందన సమావేశం జరిగింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్ణయించారు. యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణికి సీనియర్ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరువేర్కాడులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జీకే మణి నేతృత్వం వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్, అన్బుమణి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి వడివేలు రావణన్, కోశాధికారి తిలకభామ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి పీఎంకే రాష్ట్ర, జిల్లా, యూనియన్, నగర పంచాయతీల నిర్వాహకులు, పలు విభాగాలకు చెందిన ప్రతినిధులు పెద్దసంఖ్యలో వచ్చారు. మొదట అన్బుమణిని అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ తీర్మానం ఆమోదించారు. దీనికి సర్వసభ్య సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అన్బుమణిని అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే సమావేశంలో పాల్గొన్న అందరూ కరతాళ ధ్వనులతో సంతోషం వ్యక్తం చేశారు. మధ్య జిల్లా కార్యదర్శి కేఎన్ శేఖర్, అధ్యక్షుడు అనంత కృష్ణన్, నిర్వాహకులు అన్బుమణికి పూలమాల వేసి వెండి కత్తి బహూకరించారు. ముఖ్య నిర్వాహకులు అన్బుమణికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. 2026లో అన్బుమణి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని నినాదాలు చేశారు. అన్బుమణిని తండ్రి రామదాసు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. 25 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి పార్టీ అసెంబ్లీ పక్ష నేతగా కొనసాగుతారని సమాచారం.
అన్బుమణికి రాజదండం అందిస్తున్న జీకే మణి
సీఎం శుభాకాంక్షలు
చెన్నై, న్యూస్టుడే: పీఎంకే కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అన్బుమణి రామదాస్కు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజికన్యాయం మార్గంలో శ్రామికవర్గం అభివృద్ధి కోసం కృషిని కొనసాగించాలంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాతృత్వం అమోఘం
[ 09-05-2024]
ఐఐటీ మద్రాస్ అంటేనే ఒక ప్రత్యేక ముద్ర. వారు నిర్వహించే ప్రాజెక్టులకు ఎంతో ప్రజాదరణ. ఇక్కడ చదివిన విద్యార్థులంటే పెద్దపెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతాయి. మరీ ముఖ్యంగా కంపెనీలు పెట్టాలనే ఆలోచనలు ఇక్కడి విద్యార్థుల్లో ఉంటాయి. -
విద్యార్థులకు ప్రతినెలా రూ.1000
[ 09-05-2024]
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్ పుదల్వన్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్దాస్ మీనా తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే వేలాయుధన్ కన్నుమూత
[ 09-05-2024]
తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్ గెలుపొందారు. -
ఆర్థిక అసమానతలు పెరిగాయి: అన్బుమణి
[ 09-05-2024]
డీఎంకే, అన్నాడీఎంకే పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. -
ఇరాన్ నుంచి కొచ్చికి..
[ 09-05-2024]
ఇరాన్ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్గార్డ్ రక్షించింది. -
మలయాళంలోకి స్టాలిన్ స్వీయచరిత్ర
[ 09-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ‘ఉంగళిల్ ఒరువన్’ పేరిట రాసిన స్వీయచరిత్ర పుస్తకాన్ని మలయాళంలోకి అనువదించారు. బాబురాజ్ కళంబూర్ అనువదించిన పుస్తకాన్ని డీసీ బుక్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది. -
వివాహానికి జాతకానికంటే రక్తపరీక్షే ముఖ్యం
[ 09-05-2024]
వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
పీటీ మాస్టర్ పాట వీడియో విడుదల
[ 09-05-2024]
సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్హాప్ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్’. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించగా హిప్హాప్ ఆది సంగీతం సమకూర్చారు. -
గడువు తీరిన బీరు తాగి యువకుల అస్వస్థత
[ 09-05-2024]
మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్నంగుడిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇద్దరు యువకులు రెండు రోజుల క్రితం బీరును కొనుగోలు చేసి తాగారు. అది తాగిన కొద్ది సేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. -
జారవిడుచుకున్న బ్యాగు అప్పగింత
[ 09-05-2024]
మదురై సెంట్రల్ జైలు తరఫున నిర్వహిస్తున్న హోటల్లో ప్రతిరోజు చాలా మంది ఆహారం తిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్, అతని భార్య శ్రీ గంగాలు కుటుంబంతో కలిసి తమిళనాడును సందర్శనకు వచ్చారు. -
సవుక్కు శంకర్పై మరో రెండు కేసులు
[ 09-05-2024]
యూట్యూబర్ సవుక్కు శంకర్పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను కోయంబత్తూరు పోలీసులు ఇదివరికే అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్