వీధి శునకాల ఆపద్బాంధవుడు
పదేళ్లుగా వీధి శునకాల ఆకలి తీరుస్తున్నారు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ఇంద్రానగర్కు చెందిన తిరుమలై వాసన్.
శునకాలకు ఆహారం అందిస్తున్న తిరుమలై వాసన్
తిరుత్తణి, న్యూస్టుడే: పదేళ్లుగా వీధి శునకాల ఆకలి తీరుస్తున్నారు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ఇంద్రానగర్కు చెందిన తిరుమలై వాసన్. సామాజిక కార్యకర్తయిన ఈయన 2008 నుంచి తిరుత్తణి బస్టాండు, రైల్వేస్టేషన్, పాత ధర్మరాజకోవిల్ వీధి, కమలా థియేటర్ మొదలైన చోట్ల సంచరించే శునకాలకు పాలు, బ్రెడ్, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను ఉదయం, సాయంత్రం అందిస్తున్నారు. వాసన్ ద్విచక్ర వాహనంపై వచ్చే శబ్దాన్ని వినగానే శునకాలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. అదేవిధంగా వాటికి గాయాలైన, అనారోగ్యం తలెత్తినా వైద్యం చేయిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకలికి వీధి శునకాలు పడుతున్న అవస్థలు చూసి ప్రతిరోజు వాటికి ఆహారం అందజేస్తున్నట్లు తెలిపారు. రోజుకు కనీసం రూ.700 ఖర్చు అవుతుందని, అప్పుడప్పుడు వాటికి వైద్య ఖర్చులు అవుతాయన్నారు. అదేవిధంగా తన ఇంట్లో 15 శునకాలను పెంచుతున్నట్లు తెలిపారు. శునకాలు గాయపడితే 89402 70568 నెంబరుపై సంప్రదిస్తే తానే నేరుగా వెళ్లి వాటికి చికిత్స చేయిస్తానని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?