శ్రీలంక తమిళులకు రూ.11.90 లక్షల సాయం
శ్రీలంక తమిళుల సహాయార్థం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డీఎంకే కౌన్సిలర్లు రూ.11.90 లక్షల వితరణ అందించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్ తదితరులు శనివారం తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో
సీఎంకు బ్యాంకు చెక్ అందిస్తున్న మేయర్ ప్రియ
చెన్నై, న్యూస్టుడే: శ్రీలంక తమిళుల సహాయార్థం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డీఎంకే కౌన్సిలర్లు రూ.11.90 లక్షల వితరణ అందించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్ తదితరులు శనివారం తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి శ్రీలంక తమిళుల సహాయార్థం రూ.11.90 లక్షల బ్యాంకు చెక్ను సీఎం జనరల్ ఫండ్కు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, శేఖర్బాబు, ఎంపీలు టీఆర్ బాలు, రాజా, రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్ పూచ్చి మురుగన్, మాజీ ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సిట్రరసు, కార్పొరేషన్ అధికారపక్ష నేత రామలింగం ఉన్నారు.
భాషా ప్రచారమే ‘తమిళ్ పరప్పురై కళగం’ లక్ష్యం
చెన్నై, న్యూస్టుడే: తమిళం చదవడం, రాయడం, మాట్లాడటం మర్చిపోయిన దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న తమిళులకు మాతృభాషను నేర్పించడం, భాషను ప్రచారం చేయడమే ‘తమిళ్ పరప్పురై కళగం’ లక్ష్యమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. నగరంలోని అన్నా విశ్వవిద్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమిళం అనేది భాష మాత్రమే కాదని, మన ప్రాణమని తెలిపారు. అలాంటి భాషకు ప్రచార సంస్థను ప్రారంభించడం తన జీవిత బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సమాచార, సాంకేతిక రంగానికి పునాదులను డీఎంకే సర్కారే వేసిందని తెలిపారు. దానికి నేటికీ నిదర్శనంగా టైడల్ పార్కు ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు తమిళులు పనిచేయడానికి కూడా కరుణానిధే పునాదులు వేశారని తెలిపారు. తమిళులు 30కుపైగా దేశాల్లో అత్యధికంగా, 60కుపైగా దేశాల్లో స్వల్పసంఖ్యలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. 24 భాషల్లో తమిళ పాఠ్యపుస్తకాలు విడుదల చేశారన్నారు. తొలివిడతగా 25వేల మంది లబ్ధిపొందనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, సుబ్రమణియన్, కేఎన్ నెహ్రూ, మనో తంగరాజ్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?