Jayalalitha: జయలలితకు వారసులు ఉండుంటే బాగుండేది: జస్టిస్ ఆర్ముగస్వామి
జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రిలో సహాయంగా ఉండే వారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి వ్యాఖ్యానించారు.
స్నాతకోత్సవంలో పాల్గొన్న జస్టిస్ ఆర్ముగస్వామి తదితరులు
సైదాపేట, న్యూస్టుడే: జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రిలో సహాయంగా ఉండే వారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి వ్యాఖ్యానించారు. తిరుప్పూరు జిల్లా తారాపురంలో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జయలలిత మృతి గురించి దిల్లీ ఎయిమ్స్ తన నివేదికలో ఎలాంటి అనుమానం లేదని తెలిపిందన్నారు. కానీ జయలలిత గుండె సమస్యే ముఖ్యమైనదని, అలాంటప్పుడు ఆంజియో చేసుండాలని, ఎందుకు చేయలేదన్నదే తన అనుమానమని పేర్కొన్నారు. జయలలిత గుండెలో వెజిటేషియన్ అనే కాల్షియం డిపాజిటర్, చిన్న ద్వారమూ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిందన్నదే అందరి అభిప్రాయమన్నారు. ముగ్గురు వైద్యులు జయలలితకు ఆంజియో అవసరం లేదని చెప్పినట్లు, ఒక డాక్టర్ శస్త్రచికిత్స అవరం లేదని చెప్పినట్లు ఎయిమ్స్ నివేదికలో ఉందన్నారు. అందులో డాక్టర్లు సెరియన్, గిరినాథ్లు జయలలితను చూసినట్లు ఆధారాలు లేవన్నారు. వైద్యుడు శ్రీధర్ తాను చెప్పలేదని సాక్ష్యం ఇచ్చారని అన్నారు. అలాగే వైద్యుడు శ్యామువేల్ శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పలేదని వివరించారని తెలిపారు. ఆ ప్రకారం ఎయిమ్స్ నివేదికను నిరాకరించానని తెలిపారు. అందుకోసం ఎయిమ్స్ ఆస్పత్రిని తాను నిందించటం లేదన్నారు. జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రితో సహాయంగా ఉండేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?