logo

కళాశాల వార్షికోత్సవం

ఆవడి సమీప పట్టాభిరాంలోని డీఆర్‌డీసీసీసీ హిందూ కళాశాల 27వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు.

Updated : 30 Mar 2023 06:13 IST

బహుమతులు అందుకున్న విద్యార్థులతో బాబా తదితరులు

ఆవడి, న్యూస్‌టుడే: ఆవడి సమీప పట్టాభిరాంలోని డీఆర్‌డీసీసీసీ హిందూ కళాశాల 27వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. హెల్త్‌కేర్‌ సెంటర్‌ ఎండీ డాక్టర్‌ రవీంద్రన్‌, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ గౌరవ సహాయ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎన్‌ బాబా ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 2022-23 విద్యా సంవత్సరంలో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల పరిశోధనాభివృద్ధి కేంద్ర సంచాలకులు రాజేంద్రనాయుడు, కళాశాల ధర్మకర్తల మండలి సభ్యుడు గౌతమ్‌, ప్రధాన అధ్యాపకురాలు కల్విక్కరసి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని