పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ
రాష్ట్రంలో తొలిసారిగా పోలీసుశాఖలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసినట్లు డీజీపీ శైలేంద్రబాబు అన్నారు. నీలగిరి జిల్లాకు ఆయన గురువారం విచ్చేసి కున్నూర్, వెలింగ్టన్, ఊటీ పోలీస్స్టేషన్ల్ను పరిశీలించారు.
పోలీసుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న డీజీపీ శైలేంద్రబాబు
ఆర్కేనగర్, న్యూస్టుడే: రాష్ట్రంలో తొలిసారిగా పోలీసుశాఖలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసినట్లు డీజీపీ శైలేంద్రబాబు అన్నారు. నీలగిరి జిల్లాకు ఆయన గురువారం విచ్చేసి కున్నూర్, వెలింగ్టన్, ఊటీ పోలీస్స్టేషన్ల్ను పరిశీలించారు. అప్పుడు వివిధ పత్రాలు పరిశీలించారు. ఇంకా పోలీసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... ఊటీలోని గిరిజనులు అధ్యయన కేంద్రం ద్వారా పోలీసుశాఖ సామాజికన్యాయం, మానవహక్కుల విభాగ పోలీసులకు గిరిజనుల సాక్ష్యం, వారి నేరాల నిర్వహణపై పోలీసులకు రెండురోజుల శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 1.2శాతం గిరిజనులు ఉన్నారనన్నారు. గత ఏడాది వీరిపై దాడులు జరిగాయని 75 కేసులలు నమోదయ్యాయని చెప్పారు. 2,600 గిరిజనుల కుల ధ్రువపత్రాలు సరిచూసినట్లు పేర్కొనన్నారు. నీలగిరిలో వేసవి సీజన్ కోసం 900మంది పోలీసులను ఉంచినట్లు తెలిపారు. వాళ్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా నియంత్రిస్తారన్నారు. ఊటీలోనే కాకుండా మామల్లపురం, ఇతర పర్యటకప్రాంతాల్లో పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతేడాది 10 వేల మంది పోలీసులను నియమించినట్లు తెలిపారు. ఇంకా 3,500 మంది పోలీసులు శిక్షణలో చేరారన్నారు. 2,500 మంది నియమితులయ్యారని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా పోలీసుశాఖలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు