చెట్ పట్లో ఏడాది చివర్లో మెట్రో భూగర్భ పనులు
చెట్పట్లో మెట్రో భూగర్భ మార్గ పనులు ఈ ఏడాది చివరికి ప్రారంభం కానున్నాయి. టన్నల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) భూగర్భంలో దింపేందుకు కావలసిన ఇతరత్రా పనులు జరుగుతున్నాయి.
వడపళని, న్యూస్టుడే: చెట్పట్లో మెట్రో భూగర్భ మార్గ పనులు ఈ ఏడాది చివరికి ప్రారంభం కానున్నాయి. టన్నల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) భూగర్భంలో దింపేందుకు కావలసిన ఇతరత్రా పనులు జరుగుతున్నాయి. మాధవరం మిల్క్ కాలనీ నుంచి సిరుసేరి సిప్కాట్ వరకున్న 45.8 కి.మీ మార్గంలో ఇది మూడో మార్గం కానుంది. ఈ పనులు పూర్తవడానికి ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 2026 నుంచి 2028 వరకు ఈ మార్గంలో రెండో దశ పనులు విడతల వారీగా పూర్తి చేస్తామని సీఎంఆర్ఎల్ ఎండీ ఎంఏ సిద్ధిక్ పేర్కొన్నారు. చెట్పట్లో 22 మీటర్ల లోతులో పనులు జరగనున్నాయి. టీబీఎం సాయంతో కేఎంసీ మెట్రో స్టేషను సమీపంలో ఉన్న కీల్పాక్ వైద్య కళాశాల వద్ద 29 మీటర్ల లోతులో పనులు ప్రారంభిస్తారు. 838 మీటర్ల దూరంలో రెండు స్టేషన్లు రానున్నాయి. ఈ వారం మొదట్లో ఇంజినీర్లు టీబీఎంను అసెంబుల్ చేయడం ప్రారంభించారు. జులైలో చెట్పట్ మెట్రో నుంచి స్టెర్లింగ్ రోడ్డు జంక్షన్ మెట్రో వరకు భూగర్భ పనులు జరుగుతాయి. మూడో మార్గంలో మాధవరం మిల్క్ కాలనీ నుంచి చెట్పట్, నుంగంబాక్కరం, మైలాపూరు, అడయార్ల మీదుగా ఓల్డ్ మహాబలిపురం రోడ్డును అనుసంధానిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్