ఎయిడెడ్ కళాశాలలపై నిఘా అవసరం
ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి దరఖాస్తులకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఎయిడెడ్ కళాశాలలపై ఫ్లయింగ్ స్క్వాడ్తో నిఘా ఉంచాలని ‘సేవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ - తమిళనాడు’ (ఎస్హెచ్ఈఎం - టీఎన్) డిమాండు చేసింది.
వడపళని, న్యూస్టుడే: ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి దరఖాస్తులకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఎయిడెడ్ కళాశాలలపై ఫ్లయింగ్ స్క్వాడ్తో నిఘా ఉంచాలని ‘సేవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ - తమిళనాడు’ (ఎస్హెచ్ఈఎం - టీఎన్) డిమాండు చేసింది. ఎస్హెచ్ఈఎం - టీఎన్లో విద్యావేత్తలు, విశ్రాంత ఆచార్యులు, మేధావులు సభ్యులుగా ఉన్నారు. అన్ని కళాశాలలు, వర్సిటీలకు అభ్యర్థులను ఎంపిక చేసే విధానం, సీట్ల ఖాళీలు, బోధనా సిబ్బంది, ఫీజుల వివరాలు వెబ్సైట్లో ఉంచాలని యూజీసీ ఆదేశించినప్పటికీ ఎవరూ సరిగ్గా పాటించడం లేదని ఎస్హెచ్ఈఎం టీఎన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని కళాశాలలయితే వెబ్సైట్ కూడా లేకుండానే నడుస్తున్నాయన్నారు. వెబ్సైట్లున్న కళాశాలలు కూడా ప్రభుత్వం పేర్కొన్న మేరకు ఫీజు, సీట్ల వివరాలు, ఎన్ని కేటాయించారో కూడా తెలియజేయడం లేదని ఎస్హెచ్ఈఎం రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్.మురళి అన్నారు. పలు కళాశాలలు దరఖాస్తుల కోసం రూ.300 వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కొన్ని కళాశాలలయితే వెబ్సైట్లో మొదటి సెమిస్టర్ కింద మొదటి సంవత్సరం బీఏ చదివే వారికి ఎయిడెడ్ కోర్సుల్లో రూ.15 వేలకు పైనే అని కూడా వివరిస్తున్నాయి. మరి కొన్ని కళాశాలలు వెబ్సైట్ లేదా దరఖాస్తుల్లో వివరాలు లేకుండా, రసీదులు కూడా లేకుండా దాదాపు అంతే ఫీజు వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటువంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఎస్హెచ్ఈఎం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?