మాజీ మంత్రిపై చర్యలకు ఆదేశాలు
టెండర్ కేటాయింపులో జరిగిన అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ప్యారిస్, న్యూస్టుడే: టెండర్ కేటాయింపులో జరిగిన అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అన్నాడీఎంకే ప్రభుత్వం చెన్నై కార్పొరేషన్ ప్రాంతాల్లో 2018-19 మధ్య రహదారుల పునరుద్ధరణ, వాననీటి కాలువల నిర్మాణాలకు టెండర్లు కేటాయించింది. ఇందులో పలు అక్రమాలు జరిగాయని అప్పటి మంత్రి వేలుమణి, కార్పొరేషన్ కమిషనరు కార్తికేయన్, అధికారులు, కాంట్రాక్టర్లపై అరప్పోర్ ఇయక్కం తరఫున అవినీతి నిరోధక శాఖకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదుపై చర్యలు చేపట్టలేదని, ఈ విషయమై ప్రాథమిక దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని ఇయక్కం మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఇది బుధవారం విచారణకు వచ్చింది. 2019లోనే ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని సర్కారు తరఫున తెలిపారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు 2020 ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చిందని, దీంతో ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారని, కాబట్టి తదుపరి చర్యలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిని ఆమోదించిన ధర్మాసనం.. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చని తెలిపింది.
జయకుమార్కు వ్యతిరేకమైన వ్యాజ్యం కొట్టివేత
ప్యారిస్, న్యూస్టుడే: స్థల ఆక్రమణ వ్యవహారంలో మాజీ మంత్రి జయకుమార్ వేసిన వ్యాజ్యాన్ని నిరాకరించాలని కోరుతూ ఆయన బంధువు దాఖలు చేసిన పిటిషన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నై తురైప్పాక్కంలో ఉన్న స్థల యాజమాన్యానికి సంబంధించి జయకుమార్ అల్లుడు నవీన్కుమార్కి, అతని సహోదరుడు మహేశ్కి విభేదాలున్నాయి. జయకుమార్ రాజకీయ బలంతో బెదిరించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని మహేశ్ ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచు పోలీసులు దీనికి సంబంధించి జయకుమార్, ఆయన కుమార్తె జయప్రియ, నవీన్కుమార్లపై కేసు నమోదు చేశారు. మహేశ్ తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని జయకుమార్ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేేశారు. దీన్ని నిరాకరించాలని మహేశ్ కూడా కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఇవి విచారణకు వచ్చాయి. వాదనలు విన్న జస్టిస్ కుమరేశ్బాబు.. మహేశ్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వారిని మాత్రమే హైకోర్టుకి పంపాలని సూచన
ప్యారిస్, న్యూస్టుడే: కేసు వివరాలు తెలిసిన పోలీసులను మాత్రమే హైకోర్టుకి పంపాలని డీజీపీకి న్యాయమూర్తి సూచించారు. మద్రాసు హైకోర్టులో బెయిల్ పిటిషన్లను జస్టిస్ జగదీశ్ చంద్ర విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాజ్యంపై విచారణ జరిగింది. అప్పుడు హాజరైన కోయంబత్తూరు వడవళ్లి పోలీస్స్టేషన్కి చెందిన పోలీసు ఈ కేసుకి సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పలేకపోయారు. అనంతరం జస్టిస్ జగదీశ్ చంద్ర కేసు వివరాలు తెలిసిన పోలీసులను మాత్రమే హైకోర్టుకి పంపాలని పలుసార్లు చెప్పామన్నారు. ఇలా చేయడంతో కోర్టు సమయం వృథా అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు వివరాలు తెలిసిన పోలీసులను మాత్రమే హైకోర్టుకి పంపాలని డీజీపీకి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?