Dhanush - Aishwaryaa: నటుడు ధనుష్, ఐశ్వర్యలపై కేసు కొట్టివేత
నటుడు ధనుష్, ఐశ్వర్యలపై సైదాపేట కోర్టులో దాఖలైన కేసుని కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా పట్టదారి’ సినిమాలో సిగరెట్, పొగాకు
ప్యారిస్, న్యూస్టుడే: నటుడు ధనుష్, ఐశ్వర్యలపై సైదాపేట కోర్టులో దాఖలైన కేసుని కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా పట్టదారి’ సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట నిబంధనలు ఉల్లంఘించిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాలో నటుడు ధనుష్ సిగరెట్ తాగే దృశ్యాలు వచ్చే సమయంలో తెరపై హెచ్చరిక వచనాలు సరిగ్గా కనిపించలేదు. కాబట్టి నిర్మాణ సంస్థ, ధనుష్పై చర్యలు చేపట్టాలని తమిళనాడు పొగాకు నియంత్రణ సంస్థ తరఫున ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అనంతరం ఈ విషయమై విచారణ జరిపిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టరు సైదాపేట కోర్టులో ఐశ్వర్య, ధనుష్లపై కేసు దాఖలు చేశారు. అనంతరం ఈ కేసు సైదాపేట కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసును రద్దు చేయాలని ధనుష్, ఐశ్వర్య తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో కేసును కొట్టివేస్తూ జస్టిస్ ఆనంద వెంకటేశ్ సోమవారం తీర్పు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
[ 06-05-2024]
మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్ గ్రామానికి చెందిన సురేష్ (35) మద్యానికి బానిసయ్యాడు. -
కాలుష్యం.. కాస్త నయం!
[ 06-05-2024]
వాహనాలు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు.. నగరవ్యాప్తంగా కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ ఇక్కట్లు చెన్నై వాసులు నిత్యం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే చెన్నై కొంత నయమన్నట్లుగానే ఉందనే భావన కలుగుతోంది. -
‘విలేజ్ కుకింగ్’ తాత ఆరోగ్యంపై రాహుల్గాంధీ ఆరా
[ 06-05-2024]
విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్ కుకింగ్ ఛానల్కు 22 మిలియన్ చందాదారులు ఉన్నారు. -
తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు
[ 06-05-2024]
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
పోలండ్ యువతిని పెళ్లాడిన కృష్ణగిరి యువకుడు
[ 06-05-2024]
కృష్ణగిరి జిల్లా వేప్పన్హళ్లి సమీపం కురియనప్పళ్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ కుమారుడు రమేష్ (33) ఉన్నత విద్య కోసం పోలండ్ వెళ్లాడు. -
ఒకే పాఠశాల పేరుతో రెండు నీట్ కేంద్రాలు
[ 06-05-2024]
తంజావూర్, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తంజావూర్, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. -
వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు
[ 06-05-2024]
వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు తౌహీద్ జమాత్ కాంచీపురం జిల్లా శాఖ తరపున ఆదివారం కాంచీపురం వలి ముహమ్మద్పేటలోని మున్సిపల్ కార్పొరేషన్ మిడిల్ పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
ముగిసిన జయకుమార్ అంత్యక్రియలు
[ 06-05-2024]
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కాంగ్రెస్ నెల్లై తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ అంత్యక్రియలు సొంతూరు కరైసుత్తుపుదూరులో ఆదివారం జరిగాయి. -
పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్
[ 06-05-2024]
తమిళనాడు పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్ అయింది. ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పోలీసులు నిందితులు, ఫిర్యాదుల డేటా నిల్వ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. -
ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి డ్రాగన్గా టైటిల్
[ 06-05-2024]
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏజీఎస్ సంస్థ గత నెల యూట్యూబ్లో విడుదల చేసింది. -
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
[ 06-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు