కవిన్ డబ్బింగ్ పూర్తి
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
డబ్బింగ్ చెబుతున్న కవిన్
చెన్నై, న్యూస్టుడే: బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం యువన్ శంకర్రాజా. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో వైరలైంది. చిత్రానికి తన డబ్బింగ్ పనులు పూర్తయినట్టు కవిన్ ప్రకటించారు. చిత్రం త్వరలో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.
క్రికెట్ నేపథ్యంతో జేసన్ సంజయ్ చిత్రం
జేసన్ సంజయ్
చెన్నై: నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత పైచదువులకు విదేశాలకు వెళ్లాడు. నటుడిగా పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా దర్శకత్వంపై ఆసక్తితో వాటిని సున్నితంగా తిరస్కరించారు. కొన్ని డాక్యుమెంటరీలనూ తీశారు. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఓ చిత్రానికి సంజయ్ దర్శకత్వం వహించడానికి ఒప్పందం కుదిరింది. నటీనటుల గురించి పలు వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ నేపథ్యంతో ఆ చిత్రం ఉంటుందనే వార్తలు కోలివుడ్లో వినిపిస్తున్నాయి.
మెగాఫోన్ పడుతున్న లక్ష్మీ శరవణకుమార్
చెన్నై: తమిళ సాహిత్యంలో ‘ఉప్పునాయ్గళ్’, ‘రూహ్’ తదితర నవలల ద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన రచయిత లక్ష్మీ శరవణకుమార్. ‘కానగన్’ నవల కోసం సాహిత్య అకాడమి నుంచి ‘యువ పురస్కార్’ పొందారు. దర్శకుడు వసంతబాలన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన పలు చిత్రాలకు స్క్రీన్ప్లే, సంభాషణల భాగస్వామ్యాన్ని అందించారు. త్వరలో విడుదల కానున్న ‘ఇండియన్-2’కు సంభాషణలు రాశారు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్స్టార్, వికటన్ టెలివిజన్ నిర్మాణంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించడానికి లక్ష్మీ శరవణకుమార్తో ఒప్పందం కుదిరింది. ‘లింగం’గా టైటిల్ను ఖరారు చేశారు. కదిర్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ మదురై నేపథ్యంతో రూపొందనుంది. దీనిని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.
కథ, స్క్రీన్ప్లే ఉంటేనే విజయం
వెట్రిమారన్
పేరరసు, వెట్రిమారన్
చెన్నై: జీవీ ప్రకాశ్ నటించిన ‘కళ్వన్’ చిత్రం ఏప్రిల్ 4న విడుదల కానున్న నేపథ్యంలో నగరంలో ప్రి రిలీజ్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు పేరరసు మాట్లాడుతూ... ఏనుగు అంటేనే అదృష్టమని, ఏనుగుతో నిర్మించిన ‘అన్నైయోర్ ఆలయం’, ‘గుమ్కి’ తరహాలో ‘కళ్వన్’ చిత్రం కూడా భారీ హిట్ సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు వెట్రిమారన్ ఈ వ్యాఖ్యలను ఖండించేలా అదే వేదికపై ‘ఏనుగుతో తీసినా, డైనోజర్తో తీసినా స్క్రీన్ప్లే, కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు శంకర్, ఆయన సతీమణి ఈశ్వరి గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వానపత్రిక అందించారు. చిత్రంలో స్టాలిన్ సతీమణి దుర్గా ఉన్నారు.
చెన్నై, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం