విజయానికి చెమటోడ్చుతున్న అన్నామలై
కోయంబత్తూరు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు చెందిన సి.పి.రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు.
రెడ్హిల్స్, న్యూస్టుడే: కోయంబత్తూరు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు చెందిన సి.పి.రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో సీపీఐకి చెందిన నల్లకన్ను సి.పి.రాధాకృష్ణన్ చేతిలో ఓటమ పాలవడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేదు. 2019లో అన్నాడీఎంకే పొత్తుతో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి 3.92 లక్షల ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే తరఫున గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్, భాజపా నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అన్నామలైకి మద్దతుగా కోవై, మేట్టుపాళ్యంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. కోవై సౌత్ ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన వానతి శ్రీనివాసన్ వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో భారీగా వలస వచ్చి స్థిరపడిన ఉత్తరాదికి చెందిన ఓటర్లు ఉన్నారు. వారందరూ కమలం గుర్తుకే ఓట్లు వేస్తారని భాజపా నాయకులు ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో డీఎంకే, అన్నాడీఎంకేలా బలమైన బూత్ కమిటీ సభ్యులు లేకపోవడం భాజపాకు ప్రతికూల అంశంగా ఉంది. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మగళిర్ ఉరమైతొగై, ఉచిత బస్సు పథకం మహిళల్లో అధిక ప్రభావం చూపిస్తుండటం అన్నామలైకి తలనొప్పిగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, మనిదనేయ మక్కళ్ కట్చిలకు చెప్పకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు కొంగుమండలంలో మంచి పట్టున్న రాష్ట్ర మంత్రి సెంథిల్బాలాజీని ఈడీ అరెస్టు చేసి జైల్లో ఉంచడాన్ని డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్కుమార్ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించి అన్నామలైని ఇరకాటంలో పడేస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రామచంద్రన్ మాజీ మంత్రి వేలుమణి, డీఎండీకే, ఎస్డీపీఐ నాయకులతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జౌళి పరిశ్రమకు పేరొందిన నియోజకవర్గంలో పదేళ్లలో వందలాది వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి. ఇందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే కారణమని ప్రచారంలో ప్రస్తావించడం, ఇది ఓటర్లను ప్రభావితం చేసుం్తడటంతో అన్నామలై ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సముద్రగర్భంలోకి కార్బన్ డయాక్సైడ్
[ 30-04-2024]
భూమిపై పేరుకుపోతున్న కార్బన్ డయాక్సైడ్ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. -
ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
[ 30-04-2024]
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. -
ప్రకాశ్రాజ్కు అంబేడ్కర్ చుడర్ అవార్డు: వీసీకే
[ 30-04-2024]
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు 2024 ఏడాదికి అంబేడ్కర్ చుడర్ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
[ 30-04-2024]
విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు -
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!