logo

ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత

ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్‌ అన్నారు. విరుదునగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్‌కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం

Published : 18 Apr 2024 01:13 IST

కుమారుడికి బహుమతిగా వేల్‌ను అందిస్తున్న ప్రేమలత

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్‌ అన్నారు. విరుదునగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్‌కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం తిరుప్పరకుండ్రంలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే రాజన్‌చెల్లప్ప ఆమెకు వేల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. తిరుప్పరకుండ్రం ఆలయం ముందు కుమారుడికి ఓటు వేయాలని కోరి వచ్చినట్లు తెలిపారు. డీఎండీకేని కెప్టెన్‌ ఇక్కడే ప్రారంభించారన్నారు. అదే ప్రాంతంలో మీ ఇంటి బిడ్డ విజయ ప్రభాకరన్‌కి ఓట్లు అభ్యర్థిస్తున్నానన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వ నిధి అందకపోయిన తమ సొంత డబ్బు ఉపయోగిస్తామని తెలిపారు. రాజన్‌ చెల్లప్ప ఇచ్చిన వేల్‌ను కుమారుడికి బహుమతిగా అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని