logo

గాయకుడు చిట్టిబాబు మృతి

నగరానికి చెందిన ప్రముఖ గాయకుడు వాసుపల్లి చిట్టిబాబు(43) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. జీవీఎంసీ నాల్గోవార్డు పరిధి భీమిలి మండలం కాపులదిబ్బడిపాలెంలో ఆయన నివాసం ఉంటున్నారు. ఈటీవీ పాడుతాతీయగా, మాటీవీ

Published : 24 Jan 2022 02:17 IST

కె.నగరపాలెం(గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: నగరానికి చెందిన ప్రముఖ గాయకుడు వాసుపల్లి చిట్టిబాబు(43) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. జీవీఎంసీ నాల్గోవార్డు పరిధి భీమిలి మండలం కాపులదిబ్బడిపాలెంలో ఆయన నివాసం ఉంటున్నారు. ఈటీవీ పాడుతాతీయగా, మాటీవీ పాడాలని ఉందిలో పాల్గొని ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతులమీదుగా బహుమతి అందుకున్నారు. ఆయన మృతికి విశాఖ జిల్లా సింగర్స్‌ అసోసియేషన్‌(వీడీఎస్‌ఏ) అధ్యక్షుడు రాజు, ప్రతినిధులు ఉమాప్రసాద్‌, తదితరులు సంతాపం తెలిపారు.

ఓ పాటల పోటీలో విజేతగా నిలిచి ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసలు అందుకుంటున్న గాయకుడు చిట్టిబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని