వ్యవసాయం ఇదేనా..!
కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఏరువాక చేపట్టారు. వరి సాగుకు అనుకూలంగా భూములు దుక్కులు చేస్తున్నారు. విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ ఏడాది రాయితీపై ఇచ్చే విత్తనాలను కొంత
మూడేళ్లగా మట్టి పరీక్షలు లేవు..
రాయితీపై జింక్, జిప్సం ఊసేలేదు
నకిలీల విత్తనాలపై భయాందోళనలు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి న్యూస్టుడే, అనకాపల్లి
ఖరీఫ్ సాగుకు దుక్కులు చేస్తున్న రైతు
కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఏరువాక చేపట్టారు. వరి సాగుకు అనుకూలంగా భూములు దుక్కులు చేస్తున్నారు. విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ ఏడాది రాయితీపై ఇచ్చే విత్తనాలను కొంత మేర తగ్గించడంతో రైతులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మూడేళ్లుగా భూసార పరీక్షల ఊసే ఎత్తడం లేదు. గతంలో రాయితీపై ఇచ్చే జిప్సం, జింక్ వంటి వాటి జోలికి పోవడం లేదు. దీనివల్ల పెట్టుబడి భారం పెరిగిపోతోంది. పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
భూసారం తెలిసేదెలా..
‘‘భూసార పరీక్ష. మీనేలకు శ్రీరామ రక్ష’’ నినాదంగానే మిగిలిపోతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో చివరిగా 2019లో భూసార పరీక్షలు చేసి విశ్లేషణ కార్డులను అందజేశారు. ప్రతి రెండేళ్లకు ఓసారి భూసారం మారుతుంది. ఈ లెక్కన గత ఏడాది ఖరీఫ్కు ముందే పరీక్షలు పూర్తి చేసి వాటి వివరాలు రైతులకు అందించాల్సి ఉంది. ఈఏడాది ఖరీఫ్ పనులను రైతులు ప్రారంభించినా ఇంతవరకు నమూనాలను సేకరించలేదు. కొంత మంది అభ్యుదయ రైతులు భూసార పరీక్ష కేంద్రంలో రూ.30 చెల్లించి పరీక్షలు చేయించుకుంటున్నారు. మట్టి నమూనాలు ఇవ్వడానికి ఒకరోజు..ఫలితాలు తెలుసుకోవడానికి మరో రోజు అనకాపల్లి భూసార పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల రెండు రోజుల పనిదినాలు వృథాతో పాటు రానుపోను ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయని అడారి రామారావు అనే రైతు వివరించారు.
గత ఏడాది 831 మంది రైతులు మట్టిపరీక్షలకు డబ్బు చెల్లించారు. ఈ ఏడాది ఇంత వరకూ 104 మంది చేయించుకున్నారు. అదే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చేయిస్తే ఒక్కొక్క నమూనాకు రూ.300 తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఒక్క రైతు మట్టి పరీక్షలు చేయించుకోలేదు.
సూక్ష్మపోషకాల ఊసేలేదు
గత ప్రభుత్వం రైతులకు 90 శాతం రాయితీపై జింక్, బోరాన్తో పాటు జిప్సం అందించింది. జిల్లాలోని 6,348 మంది రైతులకు 2019-20 ఖరీఫ్లో 326 టన్నులు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూక్ష్మధాతువులపై రాయితీలు ఎత్తేశారు. బయట మార్కెట్లో పది కేజీలు రూ.480 ధర పలుకుతుంది. కొంతమంది రైతులు ప్రైవేటు వ్యాపారులు వద్ద కొనుగోలు చేస్తున్నారు. రాయతీపై ఇవ్వకపోవడంతో వీటి వాడకం తగ్గించేశారు.
తగ్గిపోతున్న రాయితీ విత్తనాలు
రాయితీ వరి విత్తనాలను గత మూడేళ్లుగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని గత ఖరీఫ్ సీజన్లో 28,496 క్వింటాళ్లు విత్తనం అందించారు. ఈ ఏడాదికి వచ్చేసరికి 24,136 క్వింటాళ్లు సరఫరా చేయడానికి సిద్ధం చేశారు. అంటే సుమారు 4,360 క్వింటాళ్ల విత్తనాల సరఫరా తగ్గిపోతుంది. రాయితీ విత్తనాలు తగ్గిపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధర పెట్టి కొనుగోలు చేసి కొన్నిసార్లు నకిలీల బారినపడి మోసపోతున్నారు.
ఎక్కడ చేస్తారో తెలీదు: గత మూడేళ్లగా భూసార పరీక్షలు చేయడం లేదు. గతంలో పొలాలకు వచ్చి మట్టి నమూనాలు సేకరించేవారు. ఎరువులు ఏ మోతాదులో వేయాలో తెలిపేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అవసరం అనుకుంటే రైతులనే డబ్బులు పెట్టి పరీక్షలు చేయించుకోమంటున్నారు. అవి ఎక్కడ చేస్తారో కూడా తెలియక వదిలేసుకుంటున్నాం.
-గంగరాజు, రైతు, నాగవరం
ప్రైవేటుగా కొంటున్నాం : మా భూములలో జింక్ లోపం ఉంది. దీనివల్ల వరి పంట ఎదుగుదల ఉండటం లేదు. మూడేళ్ల క్రితం సగం రాయితీపై జిప్సం ఇచ్చారు. ఈసారి వేద్దామని అడిగితే జింకు సరఫరా లేదంటున్నారు. ఎకరాన్నర భూమికి 30 కేజీలు జింక్ కావాలి. మార్కెట్లో అడిగితే రూ.1400 అవుతుందని తెలిపారు.
-టెక్కలి చిననూకరాజు, రైతు, మునగపాక
ఎక్కువ విత్తనాలే ఇస్తున్నాం: ప్రస్తుతం భూసార పరీక్షలు చేయడం లేదు. ప్రభుత్వాలు సూచించిన తర్వాత ఈ పరీక్షలు చేస్తాం. వరి విత్తనాల కోసం అయిదు వేల మందికిపైగా రైతు భరోసా కేంద్రాల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. సాగు విస్తీర్ణంలో మూడో వంతుకు మాత్రమే రాయితీ విత్తనాలను అందిస్తారు. మిగిలిన విత్తనాలు రైతులే సొంతంగా తయారు చేసుకోవాలి. నిబంధనల కంటే రాయితీ విత్తనాలు ఎక్కువే ఇస్తున్నాం.
-జి. లీలావతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ పసికందు చనిపోయింది
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!