జోరుగా గ్రావెల్ తవ్వకాలు
గ్రావెల్ తవ్వకాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ఓ నాయకుడు దుడ్డుపాలెంలో ఓ మెట్టను తవ్వుకునేందుకు రూ. 3.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
చోడవరం, న్యూస్టుడే: గ్రావెల్ తవ్వకాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ఓ నాయకుడు దుడ్డుపాలెంలో ఓ మెట్టను తవ్వుకునేందుకు రూ. 3.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రతి రోజు సాయంత్రం ఆ మెట్ట వద్ద ట్రాక్టర్లు, పొక్లెయిన్లు పనిచేస్తున్నాయని గ్రామస్థులు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
బీ-ఎన్ రహదారిని అనుకుని ఉన్న వ్యవసాయ భూములు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూములను ఇళ్ల స్థలాలు, దుకాణాల సముదాయాల నిర్మాణాలకు అనువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వెంకన్నపాలెం, సీమునాపల్లి, నర్సాపురం, దుడ్డుపాలెం-బుచ్చెయ్యపేట, అడ్డూరు, ముద్దుర్తి, గంధవరం పంచాయతీల పరిధిలో ఉన్న కొండలు, మెట్టల వద్దకు వెళ్లేందుకు రాత్రికి రాత్రే దారులు చేస్తున్నారు. ఈ తవ్వకాలతో వచ్చే గ్రావెల్తో వ్యవసాయ భూములను కప్పి చదును చేస్తున్నారు. భూములను కప్పేందుకు ఎక్కువ మొత్తంలో గ్రావెల్ అవసరం. దీంతో గ్రావెల్కు సరఫరాకు రూ.లక్షలలో బేరాలు కుదుర్చుకుని గ్రామాలలో తవ్వకాలు సాగిస్తున్నారు.
గనుల శాఖ నోటీసులు..: బి-ఎన్ రహదారిని ఆనుకుని భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని విస్తరించేందుకు వ్యవసాయ భూమిని గ్రావెల్తో కప్పేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. ఇప్పటికే చాలా గ్రావెల్ కుప్పలు ఆ భూమిలో వేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ వ్యాపారికి గ్రావెల్ ఎక్కడ నుంచి తెచ్చారంటూ గనుల శాఖ అధికారులు నోటీసులిచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వెంకన్నపాలెంలో కొండ నుంచి గ్రావెల్ తవ్వకానికి ఎలమంచిలికి చెందిన వీరునాయుడు గనుల శాఖ నుంచి 2019లో అనుమతి పొందారు. ఈయనకు 2029 వరకు లీజు గడువు ఉంది. ఇతర గ్రామాల నుంచి గ్రావెల్ వస్తుండటంతో చేసేదేమీ లేక అక్రమ తవ్వకాలపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
దీనిపై తహసీల్దారు ఎల్.తిరుమలబాబును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా గ్రావెల్ తవ్వకాలకు వెంకన్నపాలెంలో మినహా మరెక్కడా అనుమతుల్లేవని స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన సమాచారంతో పోలీసులతో దాడులు చేశామన్నారు. అక్రమ తవ్వకాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని వీఆర్వోలకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రాయపురాజుపేట వద్ద టైల్స్ వ్యాపారికి గనుల శాఖ అధికారులు నోటీసులిచ్చారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?