వైద్య పట్టభద్రుల్లో ప్రథములు
నీట్లో ఉత్తమ ర్యాంకుల సాధన.. ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో ప్రవేశం.. చేరిన వారందరూ ప్రతిభావంతులే.. కాని తుది ఫలితాల్లో ఇద్దరు మాత్రం అత్యుత్తుమ ప్రతిభావంతులుగా నిలిచి అవార్డులు కైవసం చేసుకున్నారు.
2017 బ్యాచ్లో సైమా, ప్రియాంక ఉత్తమ ప్రతిభ
వన్టౌన్, న్యూస్టుడే
ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు నుంచి బంగారు పతకం స్వీకరిస్తున్న డాక్టర్ సైమా మదీనియా
నీట్లో ఉత్తమ ర్యాంకుల సాధన.. ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో ప్రవేశం.. చేరిన వారందరూ ప్రతిభావంతులే.. కాని తుది ఫలితాల్లో ఇద్దరు మాత్రం అత్యుత్తుమ ప్రతిభావంతులుగా నిలిచి అవార్డులు కైవసం చేసుకున్నారు. తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఆంధ్ర వైద్య కళాశాల 2017 బ్యాచ్లో మొత్తం 200 మంది ఎం.బి.బి.ఎస్ కోర్సు చదివారు. వారిలో డాక్టర్ సైమా మదీనియా ఐదేళ్ల కోర్సులో అత్యధిక మార్కులు సాధించి అండర్సన్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఆఖరి ఏడాది పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన డాక్టర్ వైష్ణవి ప్రియాంక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ అవార్డు సాధించారు. నగరంలో జరిగిన ఆంధ్ర వైద్యకళాశాల పట్టభద్రుల దినోత్సవంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ జి.బుచ్చిరాజు వీరికి ఆయా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విద్యార్థినులను అభినందించారు.
ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి..
మా స్వస్థలం కృష్ణా జిల్లా పెడన. నాన్న సయీద్ అహ్మద్, అమ్మ జుబేదా బేగమ్. నాన్న అరబిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో నా ముందు ఎవరూ వైద్యులుగా పని చేయలేదు. ఎలాగైనా డాక్టర్ అవ్వాలనే పట్టుదలతో చదివి నీట్లో 520వ ర్యాంకు సాధించా. ఆంధ్ర వైద్యకళాశాలలో ఎం.బి.బి.ఎస్. సీటు వచ్చింది. కళాశాలలో చేరిన తొలిరోజు ఆందోళన, ఉద్వేగంతో గడిపా. ఇప్పటికీ అది గుర్తు ఉంది. ప్రతిష్ఠాత్మక కళాశాల నుంచి అత్యుత్తమ ఫలితాలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఇక్కడ చదువుకున్న రోజులు ఎప్పుడూ గుర్తుంటాయి. భవిష్యత్తులో మెడిసిన్/పీడియాట్రిక్ కోర్సులో పీజీ చేసి వైద్యురాలిగా స్థిరపడతా. రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తా. మొత్తం అయిదేళ్లకు కలిపి 2450 మార్కులకుగాను 1943 మార్కులు సాధించి 2017 బ్యాచ్లో అగ్రస్థానంలో నిలిచా.
డాక్టర్ సైమా మదీనియా
నాన్న స్ఫూర్తితో అడుగులు..
ఆంధ్ర వైద్యకళాశాలలో సీటు రావడం గర్వకారణంగా భావించా. ఐదేళ్లు కష్టపడి చదివా. చివరి ఏడాది పరీక్షల్లో 900 మార్కులకు గాను 728 మార్కులు వచ్చి అగ్రస్థానంలో నిలిచా. నీట్లో 500వ ర్యాంకు వచ్చింది. మాది శ్రీకాకుళం జిల్లా పలాస. నాన్న డాక్టర్ జీవితేశ్వరరావు. 40ఏళ్ల క్రితం ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. నాన్న స్ఫూర్తితో నేను ఇక్కడే చదువుకొని అత్యధిక మార్కులు సాధించా. భవిష్యత్తులో అమెరికా వెళ్లి మెడిసిన్లో పట్టా తీసుకోవాలనే ధ్యేయంతో ఉన్నా. అక్కడ ఉన్నత చదవులు పూర్తి చేసిన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చి ఆసుపత్రి ఏర్పాటు చేస్తా. తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తా. నాకు సహకరించిన కుటుంబసభ్యులు, ప్రొఫెసర్లకు రుణపడి ఉంటా.
డాక్టర్ వైష్ణవి ప్రియాంక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?