డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మాట్లాడుతున్న డీసీపీ-2 ఎం.సత్తిబాబు
జగదాంబకూడలి, న్యూస్టుడే: డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ-2 ఎం.సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తీర ప్రాంతాలకు చెందిన 13 మంది మత్స్యకారులు ముఠాగా ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీరాల్లో ఉంటున్న నౌకల వద్దకు బోట్లపై వెళ్లి డీజిల్ను దొంగలించేవారు. విశాఖ చేపలరేవుకు ఆ డీజిల్ను తీసుకొచ్చి ఇక్కడి నుంచి వేటకు వెళ్తున్న బోటు ఆపరేటర్లకు లీటరు రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముఠా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఒకటో పట్టణ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు చేపలరేవుపై నిఘా పెట్టారు. బుధవారం డీజిల్ విక్రయిస్తున్న ముఠా సభ్యులు వీర్రాజు, బడేరాజు, సురాడ రాములను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 500 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 10మంది నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ-2 సత్తిబాబు తెలిపారు. హార్బర్ ఏసీపీ మోజేస్పాల్, ఒకటో పట్టణ సీఐ భాస్కరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్