logo

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

విశాఖపట్నం నుంచి న్యూదిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 21 Jan 2022 12:30 IST

నెక్కొండ: విశాఖపట్నం నుంచి న్యూదిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. సాంకేతికలోపంతోనే పొగలు వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనతో తొలుత రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత చిన్నపాటి ప్రమాదమేనని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో రైలు అరగంట పాటు నెక్కొండలో నిలిచిపోయింది. అనంతరం యథావిధిగా బయల్దేరి వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని