మన్యంలో మత్తు మాయ
ఏజెన్సీలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. యువకులు మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక, ఎక్సైజ్ శాఖల అధికారులు
ఏటూరునాగారం, న్యూస్టుడే: ఏజెన్సీలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. యువకులు మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక, ఎక్సైజ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటూరునాగారం సబ్డివిజన్ పరిధిలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో మత్తు వినియోగం ప్రధానంగా విస్తరిస్తోంది. గ్రామాలకు కూడా పాకింది.
వినియోగానికి ప్రత్యేక అడ్డాలు
యువత గంజాయి ఆస్వాధనకు ప్రత్యేక అడ్డాలను ఎంచుకుంటున్నారు. మిత్రులంతా కలిసి గ్రామ శివారుల్లోని ప్రదేశాలను అడ్డాగా చేసుకుని గంజాయి వినియోగిస్తున్నారు. నిర్మాణుష్యంగా ఉండే మైదానాలు, తోటలు, ఖాళీ ప్రభుత్వ కార్యాలయాలు వంటి నిర్జన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఆ మత్తులో వాహనాలను ఇష్టమొచ్చిన రీతిలో నడపడం, పిచ్చిపిచ్చి అరుపులతో వేగంగా వెళ్లడం వంటి పనులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లోనైతే జాతీయ రహదారే అడ్డాగా మారింది. రోడ్డు పొడవునా జంపన్నవాగుపై మూడు వంతెనలు, చిన్న చిన్న కల్వర్టులున్నాయి. పాదచారుల కల్వర్టులు కూడా ఉన్నాయి. వాటి కింద కూర్చుని మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ముల్లెకట్ట గోదావరి వారధి సైతం అడ్డాగా ఉపయోగపడుతోంది. మత్తులో ఘర్షణలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.
సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా!
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లోని పలు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన కొన్ని తాలూకా, బ్లాక్ ప్రాంతాలు ఏటూరునాగారం సబ్ డివిజన్కు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల మీదుగా ఇవతలివైపు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం పోలీసులు నిఘా పెడుతున్నప్పటికీ వారి కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వ్యాపార స్థాయిలో పెద్దమొత్తంలో అమ్మకాలు జరపకపోయినా, యువత వినియోగించే మోతాదులో గంజాయిని నిత్యం సరఫరా చేస్తున్నారు. దీంతో యువతలో స్థానికంగా విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఇటీవలి కాలంగా నమోదైన పలు పోక్సో కేసులకు కూడా మత్తు పదార్థాల వినియోగమే కారణమన్న అభిప్రాయాలు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారులు అక్రమ సరఫరాను నియంత్రించి యువతకు మత్తు నుంచి బయటపడేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభావం చూపిస్తోందిలా..
జులై 9న ఏటూరునాగారానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి బొగత జలపాతానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా మితిమీరిన వేగంతో జాతీయరహదారి పక్కనున్న రక్షణ కంచెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడిపిన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. అతడు గంజాయితో పాటు మద్యం తాగినట్లు విశ్వసనీయ సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి