స్థిరాస్తి భూములకూ రైతుబంధు
పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన భూములకూ రైతు బంధు నిధులు జమవుతున్నాయి.
రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేయక ఖజానాకు గండి
న్యూస్టుడే, భూపాలపల్లి
ఇలాంటి స్థలాలకు పెట్టుబడి సాయం.. కుందూరుపల్లి తండా వెనుక భాగంలో కొంపెల్లి రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లు
పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన భూములకూ రైతు బంధు నిధులు జమవుతున్నాయి. వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా రూపాంతరం చెంది కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్లయినా రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ మార్పులు జరగకపోవడంతో రైతు బంధు సాయం పట్టాదారులైన రైతుల ఖాతాల్లో పడుతోంది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న కోల్బెల్ట్ ప్రాంతమైన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థిరాస్తి వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. విద్యుత్తు, ఉత్పత్తి కేంద్రంతో పాటు బొగ్గు గనుల తవ్వకాలు కొనసాగటంతో ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లి, పుల్లూరిరామయ్యపల్లి, మంజూరునగర్, భూపాలపల్లి, సీఆర్నగర్ కాలనీ ప్రాంతం జాతీయ రహదారికి ఇరువైపులా చాలా వరకు పంట పొలాలను వ్యాపారులు కొనుగోలు చేసి, ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయాలు జరుపుతున్నారు. ఈ మేరకు మంజూరునగర్ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేటు నిర్వాహకులు పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయాలు చేపట్టిన భూములకు ఇప్పటికీ రైతు బంధు నిధులు జమవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగానే రియల్ ఎస్టేటు ప్లాట్లుగా విభజించిన భూములకు 2018 నుంచి రైతు బంధు నిధులు విడుదలవుతున్నాయి.
స్థిరాస్తి వ్యాపారం జరిగే ప్రాంతాలివే..
* గణపురం మండలం చెల్పూరు శివారు నుంచి కుందూరుపల్లి తండా, కుందూరుపల్లి గ్రామంలో జాతీయ రాహదారికి అతి సమీపంలో విస్తరించిన మంజూరునగర్, పుల్లూరిరామయ్యపల్లి, కేటికే 8వ గని ప్రధాన రోడ్డు ప్రాంతం, బీసీ కాలనీ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది.
* మండలంలోని కొంపెల్లి క్రాస్ రోడ్డు సమీపంలో కుందూరుపల్లి గిరిజన తండా సమీపంలో, ఏఎస్ఆర్ గార్డెన్ వెనుక ప్రాంతంలో, పట్టణంలోని మైసమ్మ గుడి ఏరియా, రిలయన్స్ పెట్రోల్ బంకు వెనుక భాగంలో వ్యవసాయ భూములు ప్రస్తుతం చాలా వరకు నివాస స్థలాలుగా మార్చి, హద్దులు, రోడ్లు ఏర్పాటు చేసి, అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
* కేటికే 5వ గని ప్రధాన ఆర్చి నుంచి భాస్కర్గడ్డ గ్రామం వరకు ప్రధాన రోడ్డుకు అతి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాకి వెనుక భాగంలో కొత్తగా ఏర్పాటు రియల్ ఎస్టేటు ప్రాంతంలో ఇళ్ల స్థలాల విక్రయాలను చేపడుతున్నారు.
ఇవిగో తార్కాణాలు
* మంజూరునగర్ ప్రాంతంలోని సిందూరి హోటల్ ఎదురుగా ఓ రియల్టర్ పదేళ్ల క్రితం సర్వే నంబర్లు 205, 206, 208లలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, నివేశన స్థలాలు ఏర్పాటు చేశారు. భూములు సుమారు ఐదుగురు రైతుల నుంచి కొనుగోలు చేసుకున్న స్థిరాస్తి వ్యాపారి నాలా అనుమతి లేకుండానే ప్లాట్లు విక్రయించారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో నేటికీ రైతుల పేరుతో ఉండటంతో పెట్టుబడి సాయం మంజూరువుతోంది.
* కుందూరుపల్లి గిరిజన తండా వెనుక భాగంలో కొంపెల్లి ప్రధాన రహదారి పక్కన రెండేళ్ల క్రితం సర్వేనంబరు 320, 322లో సుమారు 23 ఎకరాల భూముల్లో ప్లాట్లుగా మార్చిన పంట భూములకు రైతు బంధు జమవుతోంది.
* మంజూరునగర్ ప్రాంతంలోని ఏఎస్ఆర్ వేడుక మందిరం పక్కన, వెనుక భాగంలో సర్వేనంబరు 309, 318లలో దాదాపు 15 ఎకరాల వ్యవసాయ భూములను నాలుగేళ్ల క్రితమే కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టారు. ఈ భూములకు పెట్టుబడి సాయం అందుతోంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
- మహ్మద్ ఇక్బాల్, తహసీల్దారు, భూపాలపల్లి
నాలా మార్పిడి చేసిన వాటిని రికార్డుల నుంచి తొలగించాం. ప్లాట్లుగా మార్చిన ప్రాంతాల్లో రైతు బంధు జమవుతున్న విషయం మా దృష్టికి రాలేదు. ప్లాట్లుగా మార్చిన వ్యవసాయ భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!