విదేశీ చదువుకు విద్యానిధి తోడుగా..!
డిగ్రీ పూర్తి చేసి విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనకబడిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది.
యశ్వంతాపూర్లోని క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులు
జనగామ అర్బన్, న్యూస్టుడే: డిగ్రీ పూర్తి చేసి విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనకబడిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. విద్యార్థుల చదువుకు అవసరమయ్యే రూ.20లక్షల రుణాన్ని రెండు విడతల్లో రూ.10లక్షల చొప్పున అందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్, బీసీలకు ఎంజేపీ విద్యానిధి పథకాలతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల చదువుకు భరోసానిస్తుంది. 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీలకు, 2018 నుంచి బీసీలకు ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి విదేశాల్లో అభ్యసించింది అంతంత మాత్రమే. చాలా మందికి అవగాహన లేకపోవడంతో మంచి అవకాశాలను కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థుల ప్రయోజనార్ధం విదేశీ విద్యపై ‘న్యూస్టుడే’ అందిస్తున్న కథనం..!
చేయూతనిస్తున్నా.. అంతంతే
విదేశీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తునప్పటికీ.. సద్వినియోగం చేసుకుంటున్నది కొందరు మాత్రమే. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం ప్రారంభమై ఎనిమిదేళ్లయినా ఇప్పటివరకు విదేశాలకు వెళ్లింది 8 మంది మాత్రమే. ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం ద్వారా 2019-20 విద్యా సంవత్సరంలో ముగ్గురు, 2020-21లో ఒక్కరు ఎంపికయ్యారు. మహత్మా జ్యోతిబా ఫులే విద్యానిధి పూర్తి వివరాలు రాష్ట్రస్థాయిలోనే ఉన్నందున ఈ పథకం ద్వారా జిల్లా నుంచి 12 మంది ఎంపికైనట్లు సమాచారం. ఇందులో కొందరు ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అక్కడే ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ప్రభుత్వం చేయూతనిస్తున్నా అవగాహన లేక కొందరు, అవగాహన ఉన్నా వినియోగించుకోలేనివారు మరికొందరు.
అవగాహన కల్పించాలి: జిల్లా వ్యాప్తంగా ఏటా వందలాది మంది పట్టభద్రులవుతున్నారు. ఇందులో చాలా మందికి విదేశాల్లో చదువుకోవాలనే తపన ఉన్నా ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వెళ్లలేకపోతున్నారు. విద్యానిధితో విదేశీ విద్యను ప్రోత్సహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇది అందరికీ దక్కడం లేదు. జిల్లాలో 17కు పైగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఒక ప్రభుత్వ, ఒక ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలున్నాయి. అధికారులు, కళాశాలల యాజమాన్యం అవగాహన కల్పిస్తే చాలా మంది విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
దరఖాస్తు ఇలా..
కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ, ఆధార్, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల జాబితాలతో పాటు టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్ అర్హత కలిగి ఉండాలి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశం అనుమతి పత్రం, కళాశాలకు చెల్లించిన ప్రవేశ రుసుం రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు. వీటి ఆధారంగా మీసేవా కేంద్రంలో, అంతర్జాలంలో తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్ జ్యూడిషియల్ స్టాంపును అతికించి రిజిస్ట్రార్ సంతకంతో కూడిన ధ్రువీకరణను ఆదాయ ధ్రువీకరణ పత్రానికి జతచేసి దరఖాస్తును సమర్పించాలి. ఆయా సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీ సభ్యులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.
కావాల్సిన అర్హతలు
* ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజిక శాస్త్ర కోర్సుల్లో డిగ్రీ కల్గి ఉండి 60శాతానికి పైగా మార్కులు సాధించాలి.
* టోఫెల్లో 60 శాతం. ఐఈఎల్టీఎస్లో 8.0 మార్కులు, జీఆర్ఈ, జీమ్యాట్లో 50 శాతం మార్కులు సాధించాలి.
* విద్యార్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు.
* తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
సద్వినియోగం చేసుకోవాలి
రవీందర్, డీబీసీడీవో, జనగామ
విదేశాల్లో చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. రూ.20 లక్షలు అందించి ఉన్నత విద్యాభ్యాసానికి కృషిచేస్తోంది. ఈ అవకాశం ఏడాదికి నాలుగు సార్లు ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన నిరుపేద విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!