వైకల్యం ఛేదించి.. విజయం సాధించి
తమ వైకల్యాన్ని చూసి వీరు ఏనాడూ కుమిలిపోలేదు. దేవుడు తనకే ఇలా ఎందుకు చేశాడని బాధపడలేదు. శరీరం సరిగ్గా సహకరించకపోయినా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా తమ లక్ష్యానికి అవి ఏమాత్రం అడ్డుగా భావించలేదు.
వీరి స్ఫూర్తితో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుదాం
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
-ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, చెన్నరావుపేట (వరంగల్)
తమ వైకల్యాన్ని చూసి వీరు ఏనాడూ కుమిలిపోలేదు. దేవుడు తనకే ఇలా ఎందుకు చేశాడని బాధపడలేదు. శరీరం సరిగ్గా సహకరించకపోయినా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా తమ లక్ష్యానికి అవి ఏమాత్రం అడ్డుగా భావించలేదు. చదువునే నమ్ముకుని పోటీ ప్రపంచంలో సత్తా చాటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రత్యేకంగా నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుల మేళా జరుగుతోంది. ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తోంది. తాజాగా పెద్ద ఎత్తున గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నడుం బిగించింది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులైన ప్రభుత్వ ఉద్యోగులను ‘ఈనాడు’ పలకరించింది. ఉద్యోగ సాధనకు ఎలా సన్నద్ధమయ్యారో వివరిస్తూ ప్రత్యేక కథనం.
‘ శరీరంలో ఏదో ఒక లోపంతో జన్మించిన వాళ్లు దివ్యాంగులు కాదు.. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకపోవడమే అసలైన వైకల్యం.’
భారతరత్న అబ్దుల్ కలాం
25 శాఖలు 9,168 పోస్టులు
మహబూబాబాద్ జిల్లా అనంతారంలో...
ప్రభుత్వం తాజాగా 25 శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 పోస్టులతో కూడిన గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనను విడదల చేసింది. ఈ ఉద్యోగాల సాధనకు అర్హులైన దివ్యాంగుల అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం చదవడం ప్రారంభించాలి.
టైం టేబుల్ ప్రకారం: పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నవారు టైం టేబుల్ ఏర్పాటు చేసుకోని దాని ఆధారంగా చదువుకోవాలి. దాంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు కూడా ప్రధానం. సమయానికి ఆహారం తీసుకోవాలి. దానికి తగినట్లే నిద్రకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటూ అనుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తారు.
3 శాతం రిజర్వేషన్: దివ్యాంగులు జనరల్, వారి వర్గానికి సంబంధించిన కేటగిరీల్లోనే కాకుండా ప్రత్యేకంగా 3 శాతం కేటాయించిన రిజర్వేషన్లోనూ ఉద్యోగం సాధించవచ్చు. ఈ రిజర్వేషన్లో చెవుడు, కంటిచూపు, ఆర్థోకు సంబంధించిన వాటికి వేర్వేరుగా నియామకం ఉంటుంది.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు
చెన్నారావుపేట, న్యూస్టుడే: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందని దార అశోక్ నిరూపించారు. అమీనాబాద్ గ్రామానికి చెందిన అశోక్ పుట్టకతోనే దివ్యాంగుడు. 2012లో బీఈడీ పూర్తి చేశారు. 2021లో చెన్నారావుపేట మండలం జల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 2019లో చెన్నారావుపేట మండలంలోని తోపనగడ్డతండాలో జూనియార్ పంచాయతీ కార్యదర్శిగా విధులో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని చదివి ఉద్యోగం సాధించినట్లు అశోక్ తెలిపారు.
మీకు తెలుసా..!
ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరోన్ అనే అరుదైన వ్యాధి బారిన పడి మరణించే వరకు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా చక్రాల కుర్చీలో నుంచే ఖగోళ, భౌతికశాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. నాకు శరీరం సహకరించకపోయినా నా మెదడు పని చేస్తోంది. అది చాలు..నేను పని చేయడానికి అని ఒక హాకింగ్ పేర్కొన్నారు.
విజయ సంకల్పానికి అంధత్వం అడ్డుకాదు
ఖానాపురం, న్యూస్టుడే: విజయం సాధించాలన్న తపనతో పాటు ఉద్యోగం పొందాలన్న సంకల్పం ముందు అంధత్వం అడ్డుకాదని ఖానాపురానికి చెందిన ఉపాధ్యాయుడు రాజ్కుమార్ అన్నారు. ప్రస్తుతం బుధరావుపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. వైకల్యం అడ్డుకాదని.. దాన్ని వరంగా మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు. ఆడియో పాఠాలు వింటూ మిత్రులతో గట్టిగా(లౌడ్)గా చదివించుకునేవాడినన్నారు. బ్రెయిలీ పుస్తకాలు చదువుతూ బోధన చేస్తున్నానని చెప్పారు.
ఆత్మవిశ్వాసం తోడుగా..
ఈయన పేరు మురహరి సురేష్కుమార్. వరంగల్ నగరం లేబర్ కాలనీకి చెందిన ఆయన 2008 నవంబరు 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగుతుండగా తొక్కిసలాటలో రైలు కిందపడి రెండు కాళ్లు కోల్పోయారు. నెల రోజులు చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడినా, వైకల్యం తప్పలేదు. చేతులే ఆధారంగా నడుస్తున్నారు. అయితేనేమి ఆయనలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. వైకల్యం అని అధైర్యపడక, మొక్కవోని సంకల్పంతో కులవృత్తిలోకి దిగారు. చిన్నపాటి క్షౌరశాల నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్, తనకొచ్చే అరకొర సంపాదనతో ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నానని తెలిపారు. చేతులపై భారంగా నడవాల్సి వస్తోందని, దాతలు ఎవరైనా కృత్రిమ కాళ్ల ఏర్పాటుకు సహకరించాలని వేడుకున్నారు.
ఈనాడు, హనుమకొండ (వరంగల్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం