logo

గడ్చిరోలి పోలీసులకు తప్పిన ప్రమాదం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు ప్రమాదం తప్పింది.

Published : 24 Mar 2023 04:16 IST

సంఘటనా స్థలంలో నిర్వీర్యం చేసిన బాంబు

మహదేవపూర్‌, న్యూస్‌టుడే: : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు ప్రమాదం తప్పింది. బమ్రాగఢ్‌ సబ్‌ డివిజన్‌ పరిధి పామ్‌కెన్‌ దోదరాజ్‌ అటవీ ప్రాంతంలో నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నందున ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఒక కైమోర్‌మైన్‌, రెండు కుక్కర్‌ బాంబులను బాంబు స్క్వాడ్‌ సాయంతో నిర్వీర్యం చేశారు. మందుగుండు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని