logo

మంత్రికి గజమాలతో సన్మానం

మండల పరిధిలోని గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు మండల భారాస నాయకులు శుక్రవారం గజమాలతో సన్మానించారు.

Published : 01 Apr 2023 04:11 IST

బయ్యారం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు మండల భారాస నాయకులు శుక్రవారం గజమాలతో సన్మానించారు. భద్రాద్రి నుంచి మహబూబాబాద్‌ వెళ్తున్న మంత్రి బయ్యారం బస్టాండు సెంటర్‌లో ఆగారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు.


చట్టాలపై అవగాహన అవసరం

తొర్రూరు, న్యూస్‌టుడే: విద్యార్ధిదశ అత్యంత కీలకమని, ఈ దశలో చదువుతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తొర్రూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి,  న్యాయసేవాసంస్థ ఛైర్మన్‌ యు.తిరుపతి తెలిపారు. తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సు ఆయన మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రిన్సిపల్‌ బి.రెడ్డి, ఏజీపీ ప్రవీణ్‌రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఐలోని, సీఐ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని