తీగ లాగారు.. డొంక కదులుతోంది!
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నర్సంపేటలో ఈనెల 13న జిల్లా వైద్యాధికారి సీజ్ చేస్తున్న స్కానింగ్ సెంటర్(పాత చిత్రం)
లింగనిర్ధారణ కేంద్రాలు, గర్భస్రావాలు చేసిన ఆసుపత్రులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఆడపిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న ముఠా సభ్యుల గుట్టురట్టయింది. ఇందులో పలువురు వైద్యులు, దళారులు ఉన్నారు. ఈ దందాపై ‘ఈనాడు’లో ఈనెల 13వ తేదీన ‘పురిట్లోనే చంపేస్తున్నారు..!’ శీర్షికన ప్రచురితమైన కథనం అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. వరంగల్ కమిషనరేట్ పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు రంగంలోకి దిగి కూపీ లాగుతున్నారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఈ దందాపై ఒక్కో విషయం వెలుగుజూస్తోంది.
వరంగల్క్రైం, నర్సంపేట, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నర్సంపేటకు చెందిన ప్రముఖ మహిళా వైద్యురాలు, నెక్కొండకు చెందిన ఒక వైద్యుడితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. నర్సంపేటలో పేరున్న ప్రముఖ ఇద్దరు వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిల్ల అని గుర్తించాకే బాధితులు తన వద్దకు వచ్చినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. నెక్కొండలో అదుపులోకి తీసుకున్న వైద్యుడిపై గతంలో కేసులున్నట్లు తెలిసింది. ఇప్పటికే హనుమకొండ, గోపాల్పూర్కు చెందిన వ్యక్తి మరో ఐదుగురితో కలిసి యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అబార్షను చేయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే దాడులు జరిపి స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వరంగల్ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తన సిబ్బందితో నర్సంపేటలోని బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఠాలో సుమారు 30 మంది వరకు నిందితులున్నట్లు అనుమానిస్తుండగా, వీరిలో కొందరు వైద్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని గుర్తించారు.
రూ. 50 వేల వరకు వసూలు
పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నర్సంపేట, నెక్కొండ, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాల్లో గర్భస్రావాలు జరిగినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ప్రధాన సూత్రధారి ఒకరు నగరంలో రెండు, మూడు ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని ఆడపిల్ల అని నిర్ధారించుకుని.. గర్భవిచ్ఛిత్తి చేయిస్తున్నారు. ఈయనపై గతంలో కూడా ఇలాంటి కేసు నమోదైంది. ఈ ముఠాలోని కొంతమందిని కేయూ పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరి కోసం గాలిస్తున్నారు.
ఏజెంట్ల ద్వారా దందా
ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను లింగనిర్ధారణ పరీక్షల కోసం నగరానికి తీసుకొస్తున్నారు. స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ కోసం మరో వైద్యుడి వద్దకు పంపిస్తున్నారు. సదరు ఏజెంట్లకు ముఠా పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పుతున్నారు. సుమారు 200 మందికి అబార్షన్లు చేయించి ఉంటారని పోలీసుల విచారణలో వెల్లడైందంటున్నారు. గర్భస్రావాలు చేయించుకున్న వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా.. అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
లింగనిర్ధారణ, గర్భస్రావం చేయించిన ఆరుగురిపై కేసు
దామెర: దామెరలో ఓ మహిళకు ఇష్టం లేకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయించిన బైకాని నాగరాజు, బండి నాగరాజు, కాయిత రాజు, డా.సబిత, కాశిరాజు దిలీప్, డా.బాల్నె పూర్ణిమపై మండల వైద్యాధికారి డా.జి.ఉషారాణి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదైంది. దామెర ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం దామెరకు చెందిన ఓ మహిళ మూడు నెలల గర్భవతి. ఆమెకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానం ఆడపిల్ల పుడితే ఇబ్బందులు పడతారంటూ మహిళతో పాటు ఆమె భర్తను సమీప బంధువు ఒప్పించి ఓ పీఆర్వో ద్వారా హనుమకొండ హంటర్రోడ్డులో వైద్యురాలు డాక్టర్ సబిత ఇంటికి తీసుకెళ్లారు. ఆమె పరీక్షలు నిర్వహించి ఆడపిల్ల అని చెప్పింది. సదరు మహిళ బంధువు అబార్షన్ చేయించుకోవాలని ప్రలోభ పెట్టగా రూ.18,000 చెల్లించి ఒప్పుకున్నారు. మరో వ్యక్తి వైద్యురాలు డా.బార్నె పూర్ణిమతో కలిసి దామెరలోని ఆ మహిళ ఇంటికి వచ్చి, ఇంటి వద్దనే అబార్షన్ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ