మేల్కోకపోతే ముప్పే!
వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇటీవల వేసవిలో కురిసిన వర్షాలకు మురుగు కాలువలు పొంగిపొర్లి వీధులు జలమయమై ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
అస్తవ్యస్త కాలువలతో వానాకాలంలో ముంపు భయం
డోర్నకల్, న్యూస్టుడే: వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇటీవల వేసవిలో కురిసిన వర్షాలకు మురుగు కాలువలు పొంగిపొర్లి వీధులు జలమయమై ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు డోర్నకల్, మరిపెడ, తొర్రూరు పురపాలికల్లో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో పలుచోట్ల రహదారులపై మురుగు నీరు చేరుతుంది. కొత్త మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తొలుత ఒక్కొక్క పురపాలిక సంఘానికి ప్రభుత్వం రూ.20 కోట్లు చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలలో అవస్థలు తీరుతాయని భావించినా ఫలితం అంతంత మాత్రమే. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు మహబూబాబాద్ మున్సిపాలిటీకు రూ.50 కోట్లు, మిగిలిన మూడు పురపాలికలకు రూ.25 కోట్లు, ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున కేటాయించిన నిధులతోనైనా అభివృద్ధి జరుగుతుందేమోనని ఎదురుచూస్తున్నారు.
లోపభూయిష్ట పనులతో కష్టాలు
జిల్లాలో కొత్తగా 2018లో డోర్నకల్, మరిపెడ, తొర్రూరు పట్టణాలు పురపాలిక హోదా పొందాయి. పట్టణాల్లో అంతర్గత వీధులు, ప్రధాన వీధుల వెంబడి మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉండటం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికీ మురుగు కాలువల్లేని వీధులున్నాయి. కొన్నిచోట్ల ఏళ్ల కిందట కట్టిన కాలువలు పూర్తిగా శిథిలంగా మారాయి.
దృష్టి పెడితే మేలు
జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ పురపాలికల్లో భారీ వర్షాలకు అవాస ప్రాంతాలు ముంపునకు గురవుతుండటం అందరిని కలవర పరుస్తోంది. గత వర్షాకాలంతో పాటు ఇప్పుడు వేసవిలో కురిసిన వర్షాలకు ఎదురైన చేదు అనుభవాల నుంచి అధికారగణం గుణపాఠం నేర్చితే బాగుంటుంది. శివారు ప్రాంతాల ముంపు, వీధులు జలమయం వంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైన ప్రణాలిక రూపకల్పన జరగాలి.
శివారు ప్రాంతాల్లో ..
ఏటా వర్షాలు కురిసినప్పుడల్లా మహబూబాబాద్ పురపాలిక పరిధిలోని పలు వార్డులు, శివారు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ప్రధానంగా పట్టణంలోని 18వ వార్డులో గల కొంత భాగం, నిజాం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని గోపాలపురం ముంపు బారిన పడుతున్నాయి. ధర్మన్న కాలనీలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలోకి నీరు ప్రవేశిస్తుండటంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గతంలో అధికారుల దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ పరిష్కారంపై ఎవరూ శ్రద్ధ చూపలేదు.
దీర్ఘకాలిక ప్రణాళికతోనే ప్రయోజనం
తొర్రూరు: తొర్రూరు పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతాలు భారీ వర్షాలకు ఏటా ముంపునకు గురవుతున్నాయి. తొర్రూరులోని టీచర్స్ కాలనీ పరిసరాలు, వీరప్పనగర్ శివారు ప్రాంతాలు జలమయం అవుతుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలోని నూతన కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మన గ్రోమోర్ కేంద్రం నుంచి పాల కేంద్రం వరకు ప్రధాన రోడ్డు ప్రక్కన మురుగు కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి వస్తుంది. తాత్కాలిక చర్యలు చేపడుతుండటంతో ప్రయోజనం ఉండటం లేదు. దీర్ఘకాలిక ప్రణాళిక అమలు పరచాలని తొర్రూరువాసులు కోరుతున్నారు.
అలుగుపడితే వరదే
డోర్నకల్ శివారు జయపురంలో ఆవాసాల మధ్య కొర్లకుంట చెరువు ప్రమాదకరంగా ఉంది. అలుగు పడితే నీరు మొత్తం ఇందులోకి చేరుతుంది. గతంలో జయపురం, రైల్వే క్వార్టర్లు, నెహ్రూ వీధి ముంపునకు గురయ్యాయి. ఈ కాలువలో ఇప్పటిదాక పూడిక తీయలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వార్డు కౌన్సిలరు బసిక అశోక్ తెలిపారు. చిన్నపాటి వర్షానికే డోర్నకల్లోని కుందోజు వారి వీధి జలమయమవుతోంది. పట్టణంలో ముంపు నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని పుర కమిషనర్ మున్వర్అలీ తెలిపారు. ఇప్పటికే కొంత మంది కౌన్సిలర్లు సమస్య తీవ్రత గురించి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.
మరిపెడలో అంతంతే!
మరిపెడ: మరిపెడ పట్టణంలో కార్గిల్ కూడలి నుంచి వరంగల్ మార్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షానికే కార్గిల్ కూడలిలో చెరువును తలపించేలా మురుగు నీటితో పాటు వర్షపు నీరు చేరుతోంది. దీంతో పలుమార్లు వాహనాల రాకపోకలు సైతం స్తంభించాయి. రహదారిపై గంటల తరబడి నీరు నిల్వ ఉండి గుంతలమయంగా మారుతోంది. పట్టణంలోని గిరిజన ఆవాస ప్రాంతాల్లోని వీధుల్లో అంతర్గత రోడ్లు నిర్మించి మురుగు కాలువల ఏర్పాటు చేయకపోవడంతో సీసీ రోడ్లు దెబ్బతింటున్నాయి. గ్యామాతండ, పూలబజార్, గాంధీ బజార్ ఎస్సీ కాలనీ సీతరాంపురం, కొత్తతండా, బొత్తలతండాలో మురుగు కాలువల సుమారు 8 వేల మీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!