నర్సంపేట డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా
నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో ఎడ్యుకేషన్) స్వయం ప్రతిపత్తి హోదా పొందింది. నాలుగు దశాబ్దాలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాల సొంతం.
నర్సంపేట, న్యూస్టుడే: నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో ఎడ్యుకేషన్) స్వయం ప్రతిపత్తి హోదా పొందింది. నాలుగు దశాబ్దాలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాల సొంతం. కళాశాల విద్యార్థులు పలువురు ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు. రాజకీయ రంగంలో కూడా మంచి స్థితికి ఎదిగిన వారున్నారు.
ఏడాదిలోనే..
నిరుడు మే మొదటి వారంలో పీర్ కమిటీ అధికారులు ఈ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ ఇవ్వగా ఏడాది వ్యవధిలో యూజీసీ అధికారులు స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వడం విశేషం. అటానమస్ కోసం ప్రిన్సిపల్, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా యూజీసీ అధికారులు 2022 అక్టోబరు, గత ఏప్రిల్లో కళాశాలను సందర్శించి అన్ని పరిశీలించాక మే 31న స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రపంచ పోటీని ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకునే అవకాశం కలుగుతోంది. సొంతంగా ఉద్యోగ, ఉపాధి ఓరియంటేషన్ కోర్సులు ప్రవేశ పెట్టే వీలుంటుంది. కంప్యూటర్ సైన్సు కోర్సులు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, మన టీవీ ల్యాబ్, వర్చువల్ వీడియో ప్రోగ్రామ్ ప్రత్యేక గది ఉంది. కళాశాలలో త్వరలోనే ఓపెన్ జిమ్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు.
ఆర్ట్స్ గ్రూపులతో మొదలై..
గ్రామీణ నేపథ్యం కలిగిన నర్సంపేట ప్రాంత విద్యార్థుల శ్రేయస్సు కోసం అప్పటి ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 1984లో డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. సొంత భవనం లేనందున ద్వారకపేట రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఏ, బీకాం గ్రూపులతో మొదలైన కళాశాల ప్రస్థానం అనంతర కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. 1994లో రేవూరి ప్రకాశ్రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత 1999లో వల్లభ్ నగర్లో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి పక్కా భవనం నిర్మించి బీఎస్సీ గ్రూపులను ప్రారంభించడంతో డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టింది. 2016లో పీర్ బృందం అధికారులు కళాశాలను సందర్శించి మౌలిఇక సదుపాయాలు, ఇతరత్రా అంశాలను పరిశీలించి న్యాక్ సీ గ్రేడ్ ఇచ్చారు. అప్పటి ప్రిన్సిపల్ చంద్రమౌళి స్థానిక ప్రముఖ వైద్యుడు విద్యాసాగర్రెడ్డి తోడ్పాటుతో రూ.4లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంతో 2022 మేలో పీర్ కమిటీ అధికారుల బృందం డిగ్రీ కళాశాకు న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి