బయటకు రావాలంటేనే భయం
చిరునామా తెలుసుకునే పేరుతో మాట కలిపి ఈ నెల 21న మార్టేరులో నడిచి వెళ్తున్న ద్వారంపూడి వరలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో రెండున్నర కాసుల బంగారం గొలుసును గుర్తు తెలియని యువకుడు తెంపుకొని పరారయ్యాడు. పెద్దగా జనసందోహం లేని ప్రాంతాన్ని ఎంచుకుని ఘటనకు పాల్పడ్డాడు.●
మహిళల మెడలో గొలుసుల అపహరణ
ఇటీవల జిల్లాలో వరుస ఘటనలు
పెనుమంట్ర, పాలకొల్లు గ్రామీణ, ఏలూరు టూటౌన్, న్యూస్టుడే
చిరునామా తెలుసుకునే పేరుతో మాట కలిపి ఈ నెల 21న మార్టేరులో నడిచి వెళ్తున్న ద్వారంపూడి వరలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో రెండున్నర కాసుల బంగారం గొలుసును గుర్తు తెలియని యువకుడు తెంపుకొని పరారయ్యాడు. పెద్దగా జనసందోహం లేని ప్రాంతాన్ని ఎంచుకుని ఘటనకు పాల్పడ్డాడు.●
ఐదు రోజుల క్రితం అల్లంచెర్లరాజుపాలంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. పొలంలో పశువులను మేపుతుండగా విద్యుత్తు టవర్ను పరిశీలించేందుకు వచ్చానంటూ ఓ అపరిచిత వ్యక్తి మాటకలుపుతూ లాక్కుని పారిపోయాడు.●
పొలకొల్లు మండలం లంకలకోడేరులో రహదారి పక్కన దుకాణం ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు, శీతల పానీయాలు విక్రయిస్తున్న గాది ఆదిలక్ష్మి వద్దకు ఇటీవల ఇద్దరు వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో కారులో వచ్చి సరకులు కావాలని అడిగారు. వెనుక వైపునకు తిరిగి ఇచ్చే లోపు ఆమె మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసును లాక్కుని పక్కకు నెట్టేసి.. పరారయ్యారు.
చిరునామా అడుగుతున్నట్లు.. లేదా ఏదో విషయమై ఆరా తీసినట్లు నటిస్తున్నారు. అంతే రెప్పపాటులో సొత్తును దోచేస్తున్నారు. క్షణాల్లో పని పూర్తిచేసుకుని మాయమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మళ్లీ గొలుసు చోరీ దొంగలు ఇలా విజృంభిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసి గొలుసులు దోచేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కోలా పంథా మారుస్తున్నారు.
గుడికి వెళ్లి వస్తున్నవారిని, ఇంటి ముందు అంట్లు తోముకుంటున్న వారిని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని గొలుసులు లాక్కెళ్లిపోతున్నారు. అలానే రద్దీ ప్రాంతాల్లో వాహనాలపై రయ్ మంటూ వచ్చి కాజేస్తున్నారు.
ఆందోళన.. బంగారు గొలుసులు ధరించి బయటకు రావాలంటేనే మహిళలు కంగారుపడుతున్నారు. శుభకార్యాలకు, పెళ్ళిళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు ధరించక తప్పటం లేదు. కాని ఏ మూల నుంచి ఏ దొంగ వచ్చి గొలుసులు లాక్కెళ్లిపోతాడోనని ఆందోళన చెందుతున్నారు.
వ్యసనాలకు బానిసలుగా మారి..
వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొంతమంది యువకులు అడ్డదారులు తొక్కి ఇలా గొలుసులు కాజేస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో అరెస్టైన చాలా మందిలో యువకులే ఎక్కువగా ఇలా ఉన్నట్లు వివరిస్తున్నారు. పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి డబ్బు అవసరమై ఇలా దొంగలుగా మారుతున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో జైల్లో శిక్ష అనుభవించే కాలంలో నేరస్థులు ఒకరికొకరు పరిచయమై బయటకు వచ్చాక ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత త్వరలో నిందితులను గుర్తించి అరెస్టు చేసి బాధితులకు సొత్తు అందజేస్తాం. మహిళలు ఒంటరిగా వెళ్లే సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. విలువైన సొత్తును కాపాడుకోండి. రద్దీ సమయాల్లో గుడుల వద్ద నిఘా ఏర్పాటు చేశాం. మహిళలు దిశ యాప్ను డౌనులోడు చేసుకోవాలని చెబుతున్నాం. నేరాలు జరిగిన సందర్భంలో కూడా ఈ యాప్ను ఉపయోగిస్తే పోలీసులు క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు’అని ఎస్పీ రాహుల్ దేవ్శర్మ వివరించారు..
పోలీసులు చెబుతున్న జాగ్రత్తలివి ●
నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్ధు ● రద్దీ ప్రాంతాలకు, గుడులకు ఇతర కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు బంగారు గొలుసులు ధరించొద్ధు ● అపరిచితులు కనిపిస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలి. ● దొంగలు రెక్కీ కూడా నిర్వహించి నేరాలకు పాల్పడుతుంటారు. గొలుసు చోరీల విషయంలో కూడా కొందరు అలానే చేస్తున్నారు. ● బంగారు వస్తువులు ధరించి బయటకు వచ్చిన సందర్భంలో పైటకొంగును కానీ చున్నీని కానీ మెడకు కప్పుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం