logo

స్వామి వైభవం.. ఆనంద పరవశం

అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య పరిణయోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం వాహనోత్సవాలను భక్తులు ఆనంద పారవశ్యంతో వీక్షించారు.

Published : 03 Feb 2023 02:17 IST

గజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం

అంతర్వేది, మామిడికుదురు, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య పరిణయోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం వాహనోత్సవాలను భక్తులు ఆనంద పారవశ్యంతో వీక్షించారు. సాయంత్రం 4 గంటలకు దివ్య మంగళ ఉత్సవ మూర్తులను గజ వాహనంపై కొలువుదీర్చారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంతా జయధ్వానాలు చేస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పొలమూరి సత్రం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నాన్ని ఆలయ సన్నిధిలో కుంభం పోసి స్వామివారికి నివేదించారు. అనంతరం దానిని ప్రసాదంగా భక్తులకు వితరణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని