నరసాపురం -కోటిపల్లి రైల్వే లైనుకు రూ.100 కోట్లు
పశ్చిమగోదావరి- అంబ్కేడర్ కోనసీమ జిల్లాల మధ్య అత్యంత కీలకమైన నరసాపురం-కోటిపల్లి రైల్వే లైనుకు శుక్రవారం ప్రకటించిన కేంద్ర రైల్వే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు.
రాష్ట్రం వాటాపై కానరాని స్పష్టత
విద్యుదీకరణ బకాయిలకు నిధుల కేటాయింపు
భీమవరం-నరసాపురం మధ్య పూర్తయిన డబ్లింగ్ లైను
భీమవరం అర్బన్, న్యూస్టుడే: పశ్చిమగోదావరి- అంబ్కేడర్ కోనసీమ జిల్లాల మధ్య అత్యంత కీలకమైన నరసాపురం-కోటిపల్లి రైల్వే లైనుకు శుక్రవారం ప్రకటించిన కేంద్ర రైల్వే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. జిల్లాకు అనుసంధానంగా ఉన్న ఐదు రైల్వే లైన్లకు గతంలో చేసిన విద్యుదీకరణ పనుల బకాయిలకు రూ.100 కోట్లు ఇచ్చారు. ఇలా జిల్లాకు అనుసంధానంగా ఉన్న లైన్లకు రూ.200 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది.
నరసాపురం- కోటిపల్లి రైల్వే లైను 2012లో ప్రారంభించారు. 57.21 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్రం వాటా రూ.1200 కోట్లతో భారీ వంతెనలు నిర్మించారు. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.1200 కోట్లలో ఇప్పటికి రూ.50 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం కూడా తెదేపా అధికారంలో ఉన్నప్పుడే కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం దాని కోసం ఇప్పటి వరకూ నిధుల కేటాయించలేదని సమాచారం. ఇంకా సూపర్ స్ట్రక్చర్ అంటే స్టీలు నిర్మాణాలు, సుమారు 250 చిన్న వంతెనలు, పలు చోట్ల రైల్వే అండర్ వంతెనలు నిర్మించాలి. మట్టిపనులు, రైల్వేలైను, విద్యుదీకరణ చేయాలి. భూసేకరణ కోసం రైల్వే రూ.300 కోట్లు రాష్ట్రానికి ఇస్తే వాటిలో రూ.120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ఉన్న రూ.180 కోట్లు తిరిగి ఇస్తే నిర్మాణ పనులు చేపడదామని రైల్యే సూచించినా రాష్ట్రం నుంచి స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై రైల్యే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలమని చెప్పగా..‘రాష్ట్రం వద్ద బడ్జెట్ లేదు. మేము ఏమీ చేయలేము’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది.
బకాయిలకు మరో రూ.100 కోట్లు
జిల్లాకు అనుసంధానంగా వెళ్లే విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- గుడివాడ, మోటూరు- భీమవరంటౌన్, భీమవరం- నరసాపురం, భీమవరం- నిడదవోలు మధ్య రైల్వే లైను విస్తరణ, విద్యుద్దీకరణ పనులు గతేడాది చేశారు. ఆ పనులకు సంబంధించిన బకాయిలకు రూ.100 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.