ఇలాంటి మరమ్మతులెందుకు?
ఉమ్మడి జిల్లాలో నగర, పట్టణదారుల తీరు అధ్వానంగా ఉంది. కొత్తగా నిర్మాణం ఊసే లేదు. మరమ్మతులకు నగరబాట పేరుతో పథకం చేపట్టినా ప్రభుత్వం ఒక్క పైసా నిధులు విదల్చడం లేదు. దీంతో మరమ్మతులు సైతం నాసిరకంగా, నామమాత్రంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.
గుంతలమయమైన పట్టణ దారులు
నాసిరకంగా పనులు
భీమవరం రెస్ట్హౌస్రోడ్డుకు కంకర వేసి..తారువేయకుండా వదిలేశారిలా..
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే- జంగారెడ్డిగూడెం, భీమవరం పట్టణం, మొగల్తూరు : ఉమ్మడి జిల్లాలో నగర, పట్టణదారుల తీరు అధ్వానంగా ఉంది. కొత్తగా నిర్మాణం ఊసే లేదు. మరమ్మతులకు నగరబాట పేరుతో పథకం చేపట్టినా ప్రభుత్వం ఒక్క పైసా నిధులు విదల్చడం లేదు. దీంతో మరమ్మతులు సైతం నాసిరకంగా, నామమాత్రంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.
నాలుగంటే నాలుగే పూడ్చి..
నగర బాటలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీసీ రహదారుల్లో 61 గుంతలను గుర్తించారు. సుమారు 6.68 కి.మీ. మేర పూడ్చడానికి రూ.19 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు కేవలం నాలుగంటే నాలుగు పూడ్చారంటే పరిస్థితి అర్థమవుతోంది. నాలుగో సచివాలయం రోడ్డులో కార్యాలయ సమీపంలోనివి మాత్రమే పూడ్చి నివాసాలు ఉన్నచోట వదిలేశారు.
రూ.5 లక్షలు దుమ్ములో కలిపేశారు
జంగారెడ్డిగూడెంలోని బుట్టాయగూడెం రహదారి గుంతలు పడటంతో కొద్ది నెలల కిందట సాధారణ నిధులు రూ.5 లక్షలతో మరమ్మతులు చేశారు. శాశ్వత ప్రాతిపదిక పూడ్చలేదు. స్టోన్ డస్ట్ కొట్టుకుపోయి ప్రస్తుతం గుంతలు మిగిలాయి. వాహనాల వేగానికి దుమ్ము రేగుతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. అధికారపక్ష సభ్యుడు, పట్టణ వైకాపా అధ్యక్షుడు చంద్రరావు ఇటీవల జరిగిన పురపాలక సమావేశంలో ఈ రహదారి గురించి మాట్లాడుతూ.. ఇలాంటి మరమ్మతుల చేయడం కంటే మానుకోవడమే మేలంటూ మండిపడ్డారు.
నాణ్యతతో పనిలేదు
గుంతల మరమ్మతులకు పురపాలికలు రూ.లక్షల్లో నిధులు కేటాయిస్తున్నా.. చేసిన పనుల్లో నాణ్యత లేమి కనిపిస్తోంది. వేసిన కొన్ని రోజులకే యథాస్థితికి వస్తున్నాయి. దీంతో అధికారులు నామమాత్రంగా చేసి నిధులు దారి మళ్లిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో మరమ్మతులకు చతురస్రాకారంలో గుంతలు తవ్వేవారు. అందులో తారువేసి రాళ్లు, వెట్మిక్స్ కలిపి వేసేవారు. తారు వేసేముందు ఒకరోజు తడిపేవారు. ప్రస్తుతం అలాంటివి ఏమీ చేయకుండా వేసేస్తున్నారు. దీంతో వర్షాలు కురిస్తే మళ్లీ రాళ్లు లేచిపోతాయి. భీమవరం పట్టణంలోని 39 వార్డుల్లోని రహదారుల మరమ్మతులకు రూ.50 లక్షలు కేటాయించారు. రెస్ట్హౌస్రోడ్డులో మరమ్మతుల నిమిత్తం వేసిన రాళ్లు పైకి లేచి ప్రమాదకరంగా ఉన్నాయి.
చేశామంటే చేశాం
నరసాపురం పురపాలికలో రహదారులకు మరమ్మతులు చేశామంటే చేశాం అన్న రీతిలో అధికారుల తీరు ఉంది. రూ.12 లక్షలు కేటాయించి పార్కురోడ్డు, కోర్టువీధి, టవర్వీధి, మన్నెవారివీధుల్లో గుంతలు పూడ్చారు. ప్రస్తుతం తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. నాణ్యత లేమి కొద్ది రోజుల్లోనే బయటపడింది. గుంతల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. పట్టణంలోని వైఎస్ఆర్ నగర్, మిషన్హైస్కూలురోడ్డు, ఆంధ్రాబ్యాంకు తదితర ప్రాంతాల్లోని రహదారులు దెబ్బతిన్నా వాటికి ఈ మాత్రం మరమ్మతులు కూడా చేయలేదన్న విమర్శలున్నాయి.
పార్కురోడ్లో మరమ్మతులు చేయాల్సిన ప్రాంతం
పూడ్చారు.. ఏమార్చారు
ఏలూరు వన్టౌన్ కొత్త రోడ్డులో పెట్రోలు బంక్ సమీపంలో ఈ గుంతను 4 నెలల క్రితం పూడ్చారు. అక్కడే గ్రావెల్ లేచిపోయి యథావిధిగా గొయ్యి ఏర్పడింది. నాణ్యతాప్రమాణాలను విస్మరించడంతో ఇలా తయారైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లోనూ రోడ్ల పరిస్థితి ఇదే. గుంతలు పూడ్చారు గానీ సక్రమంగా పనులు చేయకపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటంలేదు.
సాధారణ నిధులు.. ఇష్టారాజ్యం
నగరబాట పేరుతో రహదారులు మరమ్మతులు చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా లేదు. అన్ని చోట్లా సాధారణ నిధుల నుంచే కేటాయిస్తున్నారు. దీంతో సొమ్మొకరిది..సోకొకరిది అంటూ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం 35వ వార్డులో కొన్నేళ్లుగా భూగర్భ మురుగు బోదె వ్యవస్థ, కొన్ని సంస్థలు తవ్విన పైపు లైన్లు, మంచినీటి పైపులైన్ల పనుల్లో భాగంగా కొన్ని సీసీ రహదారులు ధ్వంసమయ్యాయి. వాటిని సంబంధిత గుత్తేదారులే నిర్మించాల్సి ఉన్నా.. అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. రూ.21 లక్షల వ్యయంతో పట్టణంలోని 342 గుంతలు పూడ్చారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఈ అంశంపై రాజమహేంద్రవరం ఆర్డీ సత్యనారాయణరావును వివరణ కోరగా ‘సీసీ దారుల నాణ్యత విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారితో పాటు గుత్తేదారులను కూడా బాధ్యులను చేస్తాం. నాసిరకంగా వేసిన రహదారులపై సమీక్ష చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.