logo

20 నుంచి జగన్నాథ రథోత్సవాలు

ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయమైన లక్ష్మీపురం శ్రీవేంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథ రథోత్సవాలు ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

Published : 06 Jun 2023 04:28 IST

బలభద్ర, సుభద్రాదేవి సమేత జగన్నాథస్వామి దారు విగ్రహాలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయమైన లక్ష్మీపురం శ్రీవేంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథ రథోత్సవాలు ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. మొదటి రోజు ద్వారకా తిరుమలలో, చివరి రోజు తిమ్మాపురంలో స్వామివారి రథయాత్ర కనుల పండువగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ పది రోజులూ స్వామివారి దశవతారాలు భక్తులను కనువిందు చేయనున్నట్లు చెప్పారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని