అరకొర వైద్యం.. అందని మందులు
జిల్లా కేంద్రం ఏలూరులోని ఈఎస్ఐ డిస్పెన్సరీ సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవటంతోపాటు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు.
సమస్యల సుడిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ
వెంటాడుతున్న సిబ్బంది కొరత
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే
డిస్పెన్సరీలో వైద్యసేవలందిస్తున్న వైద్యుడు
జిల్లా కేంద్రం ఏలూరులోని ఈఎస్ఐ డిస్పెన్సరీ సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవటంతోపాటు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. దీని పరిధిలో వేలాదిమంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఆసుపత్రి నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా ఇంత వరకు అమలు కాలేదు. డిస్పెన్సరీలోనైనా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోవటంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈఎస్ఐకు జిల్లా నుంచి ఏటా కోట్లాది రూపాయల నిధులు సమకూర్చినా కార్మికులకు ఆ మేరకు వైద్యసేవలు అందడం లేదు. ఏలూరు డిస్పెన్షరీలో రోజుకు 150 నుంచి 200 మంది ఓపీ సేవలు పొందుతుంటారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, గ్యాస్ ట్రబుల్, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇలా చిన్నచిన్న అనారోగ్యాలకు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారు. మిగిలిన వాటికి విజయవాడ రిఫర్ చేస్తున్నారు.
దీర్ఘకాలిక రోగాలకు ఔషధాలేవీ
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి వైద్యం, మందులు అందుబాటులో లేవు. బయట మందులు కొనుగోలు చేయాల్సి రావడంతో నెలకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయం, వెన్నుముక సంబంధ సమస్యలు, స్పాండిలైటిస్ వంటి రోగాలకు ఇక్కడ ఔషధాలు ఉండవు. దీంతో పాటు కొంతకాలంగా రక్తపోటు, మధుమేహానికి కూడా ఇవ్వడంలేదని రోగులు వాపోతున్నారు.
నలుగురికి ఒక్కరే
నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే సేవలందిసున్నారు. పీజీ చదివేందుకు ఇద్దరు, డిప్యుటేషన్పై మరొకరు వెళ్లిపోవటంతో ఆ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వైద్యులతో కలిపి మొత్తం 22 పోస్టులున్నాయి. వాటిలో స్టాఫ్ నర్సు పోస్టులు రెండూ ఖాళీగా ఉండటం గమనార్హం. ఫార్మాసిస్టులు ముగ్గురికి ఇద్దరే ఉన్నారు. ల్యాబ్టెక్నీషియన్, ఏఎన్ఎం, ఎఫ్ఎన్ఎం, సీనియర్ అసిస్టెంట్ ముగ్గురు ఉన్నారు. ఇక జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. అటెండర్లు ఇద్దరికి ఒక్కరు, రెండు తోటీ పోస్టుల్లో ఒక్కరే ఉన్నారు.
భర్తీకి చర్యలు
‘డిస్పెన్సరీల్లో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. స్టాఫ్ నర్సులను ఇప్పటికే తీసుకున్నాం. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఈఎస్ఐ ఆస్పత్రుల జేడీ జి.జగదీప్ గాంధీ తెలిపారు.
బీపీకీ కూడా లేవన్నారు
జూట్మిల్లు విశ్రాంతి ఉద్యోగిని. ఏలూరు డిస్పెన్సరీలో కొంతకాలంగా బీపీ మందులు ఇవ్వడం లేదు. స్టాకు రాలేదని చెబుతున్నారు. దీంతో బయట కొనుక్కుంటున్నాను. రూ.1000 ఖర్చవుతోంది. వృద్ధాప్యం మీద పడటంతో ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మందులు అందుబాటులో ఉంచితే మాలాంటి వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
జి.మాణిక్యమ్మ, ఏలూరు.
రూ.2 వేలవుతోంది
స్పాండిలైటిస్తో బాధపడుతున్నా. ఇక్కడి డిస్పెన్సరీలో వైద్యం లేదంటే విజయవాడ వెళ్లా. ప్రైవేటు ఆసుపత్రిలోనూ చికిత్స చేయించుకున్నా. ఇక్కడ మందులు లేకపోవడంతో నెలనెలా రూ.2 వేలు పైనే ఖర్చవుతోంది.
ఎం.జయకృష్ణ, కొత్తూరు జూట్మిల్లు వర్కరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం